తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చంపేస్తామంటూ బెదరింపు కాల్.. ఆయన నివాసం వద్ద బాంబులు పెట్టామ?

Publish Date:May 20, 2022

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదరింపు కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆయన నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ ఓ అజ్ణాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తో పోలీసులకు చెమట్లు పట్టాయి. బాంబు స్క్వాడ్ తో ముఖ్యమంత్రి నివాసం, ఆయన కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు చివరికి అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చంపేస్తామంటూ బెదరింపు కాల్ చేసిందెవరన్నదానిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. అతడి పేరు తామరైకన్నన్ అనీ, తురునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన వ్యక్తనీ గుర్తించారు. గంజాయి మత్తులో అతడు బెదరింపు కాల్ చేశాడని భావిస్తున్నారు. ఏది ఏమైనా స్టాలిన్ ను చంపేస్తామంటూ బెదరింపు కాల్ రావడంతో తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా విపక్షాలను కలుపుకుంటూ సుపరిపాలన అందించే దిశగా కదులుతున్న స్టాలిన్ ప్రాణాలకు ముప్పు ఉందని చాలా కాలంగా ఆందోళన వ్యక్తమౌతున్నది.

ఈ నేపథ్యంలోనే స్టాలిన్  నివాసంలో బాంబులు పెట్టామనీ, ఆయనను చంపేస్తామనీ వచ్చిన కాల్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడమే కాకుండా ఆందోళనకూ కారణమైంది. చివరకు అది ఫేక్ కాల్ గా నిర్ధారణ అయినప్పటికీ స్టాలిన్ భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి
భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది. ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది.
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.