బ్లాక్ బాక్స్ లో అంతా భద్రం..  మిస్టరీ హిస్టరీ సేఫ్‌..

Publish Date:Dec 9, 2021

Advertisement

విమాన, చాపర్ ప్రమాదాలు జరగగానే బ్లాక్ బాక్స్‌ తెరపైకి వస్తుంది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. ఇప్పటికే బ్లాక్ బాక్స్ అనేది ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టాయి. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై వాయుసేన దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో బ్లాక్స్ బాక్సే కీలకం కానుంది. హెలికాప్టర్‌ ప్రమాదస్థలిని పరిశీలించిన వాయుసేన అధికారులు  బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. బ్లాక్ బాక్స్ లో నమోదైన సంభాషణలను డీకోడ్ చేస్తూ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..? డేటాను ఎలా నిక్షిప్తం చేసుకుంటుంది? 

బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇందులో రికార్డు అవుతుంటాయి. ఒకవేళ రేడార్ సిగ్నల్స్‌ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు చేస్తారు. విమానంలో ఎంతో మంది ప్రాణాలు ఉంటాయి. కాబట్టి బ్లాక్ బాక్స్ తప్పనిసరిగా ప్రతి విమానంలోను ఉండాలనేది విమానాయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు. 

బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది?

బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా  ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లోనే ఎందుకుంటుందో అనేదాని వెనక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాదసమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్‌ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుంది. 

బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే ఎందుకు అమరుస్తారు..?

బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఇక్కడే ఎందుకు అమరుస్తారంటే ఇది చాలా సురక్షితమైన చోటని నిపుణులు చెబుతున్నారు.  విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వసం కాదు కాబట్టి ఇక్కడే బ్లాక్ బాక్స్‌ను అమరుస్తారు. అదే కాక్ పిట్ అయితే ఎక్కువగా ధ్వంసమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 

బ్లాక్ బాక్సులో ఏముంటాయి? ఎలా పని చేస్తుంది?

బ్లాక్ బాక్సులో రెండు కాంపొనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లయిట్ డేటా రికార్డర్ (FDR) రెండోది కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (CVR).FDR విమానంకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతుంది. అంటే ట్రాజెక్టరీ, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది. వేగం, ఇంధనం ఎంత ఉంది, ఇంజిన్ థ్రస్ట్ లాంటి ముఖ్య పారామీటర్ల సమాచారం స్టోర్ చేస్తుంది ఎఫ్‌డీఆర్. అంతేకాదు విమానం ప్రతి కదలికను రికార్డు చేస్తుంది. అంతేకాదు ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు.. ల్యాండింగ్ గేర్‌ వేయడంలో జాప్యం జరిగిందా, లేదా పాక్షికంగా ధ్వంసమైందాలాంటి అంశాలను కూడా ఎఫ్‌డీఆర్ రికార్డు చేస్తుంది. 

ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌ కాక్‌పిట్‌లో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేస్తుంది. పైలట్ల సంభాషణ నుంచి ఏటీసీతో పైలట్ల సంభాషణ వరకు ప్రతిదీ రికార్డు అవుతుంది.  ప్రమాదంకు ముందు అరగంట ఏం జరిగిందనేదే కీలకం ఇక పైలట్ ఎక్కడైనా సమస్య ఎదుర్కొన్నారా.. లేక విజిబులిటీ, లేదా వాతావరణ ఇబ్బందులను ఏటీసీకి తెలిపారా..? ప్రమాదం ముందు కాక్‌పిట్‌లో ఏంజరిగింది? వంటి కీలక విషయాలను సీవీఆర్ బయటపెడుతుంది. సీవీఆర్ అందించే నివేదిక ఆధారంగానే ఇది సాంకేతిక సమస్యతో విమాన ప్రమాదం జరిగిందా లేక మానవతప్పిదంతో ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ధృవీకరిస్తారు. ఇవన్నీ ఒక మెటల్ బ్లాక్‌లోని మెమొరీ బోర్డుపై స్టోర్ అయి ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత దీన్ని వెలికి తీసి డీకోడ్ చేస్తారు. 

ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. అయితే క్షణాల్లో, నిమిషాల్లో జరిగే ప్రమాదాలు బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తం కావడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు. 
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు.
ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది
Publish Date:Apr 17, 2024
ఏపీలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మళ్లీ జగన్ ఎందుకు? ఈ ప్రశ్న వేస్తున్నది విపక్షాలు కాదు. జనం. సామాన్య జనం. కొన్ని నెలల కిందట జగన్ శిబిరమే ఏపీకి జగనే ఎందుకు కావాలో వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది.  ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి  స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.