కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు మెగ్గలోనే తుంచేయడానికి కమలం వ్యూహాలు

Publish Date:Jul 5, 2022

Advertisement

తెలంగాణలో బీజేపీ రాజకీయ బల ప్రయోగానికి సిద్ధపడింది. తెలంగాణలో అధికారం చేపట్టడమొక్కటే లక్ష్యం కాదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై చేయి సాధించి ఊరుకోవడం కాదు. ఆ పార్టీ అధినేత జాతీయ ఆశలకు చెక్ పెట్టడం. ఇంకో మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షకు సమాధి కట్టేయడం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు కేసీఆర్ తోనే మొదలు కాలేదు.

కేసీఆర్ తోనే అంతం కావు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తుల ఏకీకరణ విషయంలో కేసీఆర్ కంటే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఒకింత శక్తిమంతంగా ముందుకు సాగుతున్నారు. ఆమె వెనుక జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిన శరద్ పవార్ వంటి నేతలూ ఉన్నారు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. ఈ ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు చెబుతున్న జవాబు దక్షిణాదిన పార్టీ పునాదులు బలంగా పడాలంటే కర్నాటక ఒక్కటే చాలదు.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంటే..   ఏపీలో వేళ్లూనుకోవడానికి ఆ పార్టీకి ఒక బేస్ దొరుకుతుంది. ఏపీలో అధికార వైసీపీ ఇప్పటికే కమలం చెప్పు చేతల్లో నడుస్తోంది. ఇక తెలంగాణలో కేసీఆర్ ను నిలువరిస్తే చాలు. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మరో సారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.

ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అభివృద్ధి అజెండాను బలంగా ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో కేంద్రంలో కూడా గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. అయినా మరో సారి కేంద్రంలో జెండా ఎగురవేయగలమన్న ధీమా కమలనాధుల్లో వ్యక్తం కావడానికి  విపక్షాల అనైక్యతే అధికారాన్ని పువ్వుల్లో పెట్టి అందిస్తుందన్న విశ్వాసమే. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆ సంగతి మరోసారి ప్రస్ఫుటమైంది. అయితే ఇక్కడే కేసీఆర్ తన వ్యూహాలతో కేంద్రంలో మూడో సారి అధికారం అన్న కమలనాథుల కలలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉందనడంలో సందేహం లేదు. ఇక విపక్షాల ఐక్యత ఎండమావే.. కానీ ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసే వ్యూహంతో కేసీఆర్ కదుపుతున్న పావులు తమ కాళ్లకు అడ్డం వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.

కేసీఆర్ వ్యూహాత్మకంగా మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం.. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం వంటి చర్యలతో జాతీయ స్థాయి మీడియాను అట్రాక్ట్ చేశారు.  గుజరాత్ సీఎంగా మోడీ ఏరకంగా అయితే జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారో... ఇప్పుడు అదే దారిలో కేసీఆర్ పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది అన్న అర్ధం వచ్చేలా జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పించి తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఒక వాతావరణాన్ని కల్పించుకునే ప్రయత్నం బలంగా చేశారు. సరే జాతీయ స్థాయిలో పార్టీలు కలసిరాకపోవడం వేరే సంగతి అయితే బీఆర్ఎస్ అంటూ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బలంగా మోడీని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దేశ రాజకీయాలలో బీజేపీ వినా మరో జాతీయ పార్టీ బలంగా కనిపించని పరిస్థితి. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆయా పార్టీల సిద్ధాంతాలూ, ఆకాంక్షలు వేటికవి భిన్నమే అయినా.. కేసీఆర్ ఆ పార్టీల మధ్య సయోధ్య సాధించి 2024 ఎన్నికల నాటికి ఒక బలమైన పోటీదారుగా వచ్చే అవకాశాలున్నాయన్నది కమలనాథుల అంచనా. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు వ్యూహరచన నుంచి కార్యాచరణ వరకూ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మోడీషా ద్వయమే. ఒక నిర్దుష్ట సిద్ధాంతం పునాదిగా ఆవిర్భవించినట్లు చెప్పుకునే బీజేపీ ఇప్పుడు తెలంగాణలో చేరికలను ప్రోత్సహించడానికి సిద్ధపడిపోయింది.

ఈ చేరికల సమన్వయ బాధ్యతలను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తమ గూటికి చేరిన ఈటలకు అప్పగించింది. అంటే అర్ధమేమిటి? ఈటల టీఆర్ఎస్ లో తన పరిచయాలనూ, పలుకుబడినీ ఉపయోగించి ఆ పార్టీ నుంచి కమలం పార్టీలోని వలసలను ప్రోత్సహించడం.  తెలంగాణలో టీఆర్ఎస్ విజయానికి అవకాశాలు సన్నిగిల్లుతున్నాయన్న వాతావరణాన్ని కల్పిస్తే కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉండదు. ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. బీజేపీ చేసింది, చేస్తున్నది అదే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కారణంగా కేసీఆర్ పూర్తిగా తెలంగాణపైనే దృష్టి సారించినా ఇక్కడ మరో సారి అధికారం చేజిక్కించుకునేందుకు చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో అటువంటి వాతావరణం ఏర్పడింది. దానిని కొనసాగించడమే బీజేపీ లక్ష్యంగా చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతలా కేసీఆర్ ఇటు తెలంగాణలో అధికారానికి దూరం చేయడం, అటు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడం లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను అమలు చేస్తున్నది. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమై కేసీఆర్ కు సవాల్ విసురుతుండటం కూడా కమలానికి కలిసి వస్తున్నది.

By
en-us Political News

  
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది.
గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు.
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.