బీహార్ సీఎం రాజీనామా.. కుప్పకూలిన ఎన్డీయే సర్కార్

Publish Date:Aug 9, 2022

Advertisement

బీహార్ లో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో బీజేపీ-జూడీయూ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అంద జేశారు.  ఇక జేడీయూ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నితీష్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  నితీష్ కుమార్ రాజీనామాతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చినట్లైంది.  కాగా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు.

ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందంటూ జేడీయూ  లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభ్యులు చెప్పారనీ,  వారి నిర్ణయం మేరకే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పారు.  భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. రాజీనామా చేసిన అనంతరం నితీష్ రాజ్ భవన్ నుంచి  నేరుగా మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసానికి బయలుదేరి వెళ్లారు.  దారి పొడవునా ఆయనకు ఆర్జేడీ-జేడీయూ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు   స్వాగతం పలికారు. రెండు పార్టీలకు చెందిన జెండాలను పట్టుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

రబ్రీ దేవి నివాసంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు.   ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు.  ఇలా ఉండగా మంగళవారం నాడే ( ఆగస్టు9) నితీష్ కుమార్ మరోసారి గవర్నర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆర్జీడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని చెబుతున్నారు.

రాజీనామాకు ముందే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఫోన్‌లో సంభాషించారు. పొత్తు విషయాన్ని నిర్ధారించుకున్నారు. పొత్తు ఖరారైన తరువాతే నితీష్ కుమార్ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వస్తే తాము మద్దతు ఇస్తామంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి విదితమే. . బీజేపీయేతర ప్రభుత్వం గనక ఏర్పాటైతే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని బీహార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజిత్ శర్మ సైతం తెలిపారు.  

By
en-us Political News

  
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు.
కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని,
గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది.
వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి.
మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు.
ఇసుకేస్తే రాలనంత జనం. నామినేషన్ ర్యాలీయే విజయోత్సవాన్ని తలపించిన వైనం. ప్రత్యర్థి ఓటమిని ఖారారు చేసిన సందర్భం. ఇదీ గవన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా బుధవారం (ఏప్రిల్ 24) యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యం.
తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి
భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ స్నేహం గురించి చెప్పుకోవలసి వస్తే ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ గురించే చెప్పుకోవాలి. 2018లోనే అంటే నిర్దిష్ట గడువు కంటే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో తన మిత్రుడు జగన్ విజయం కోసం తెలంగాణ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
పాపం జగన్ అండ్ కో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి గులకరాయి డ్రామా ఆడి జనంలో సానుభూతి సంపాదించుకోవాలని అనుకున్నారు.
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.