మూడు దక్షినాది రాష్ట్రాలలో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు?

Publish Date:May 28, 2022

Advertisement

కర్ణాటక శాసన సభ గడువు ముగుస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో, ఆ రాష్ట్ర్ర  శాసన సభకు ఎన్నికలు జరగవలసి వుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయా, అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.

నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నిండా రెండేళ్ళ గడువుంది. తెలంగాణ అసెంబ్లీకి సంవత్సరం పైగానే సమయముంది. అయితే,  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజు పెరుగతున్న నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. 
నిజానికి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలతో పాటుగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రెంత్ రెడ్డి ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి మొదలు ఆయన ఆలోచనలు స్థిరంగా ఉండడం లేదు. ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు మొదలు, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ఫ్రంట్  ఏర్పాటు వరకు అనేక ఆలోచనలు  చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే సెంటిమెంట్’ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకత కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా ఫలించక పోగా, ఒక్కొక్క ప్రయత్నంతో రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం మరింతగా బయట పడుతోంది. ఉదాహరణకు వరి ధాన్యం కొనుగోలు పై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళన చేసినా, చివరకు రైతుల పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొంటోందని రైతులకు తెలిసి వచ్చింది. చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందని గత ఎనిమిది సంవత్సరాలుగా తెరాస చేస్తున్న ప్రచారంలో ఒక గింజంత నిజం లేదని రైతులకు తెలిసి పోయింది.అందుకే కొత్తగా దక్షణాది వర్సెస్ ఉత్తరాది అనే కొత్త నినాదంతో ముందుకు పోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగా మూడు దక్షణాది రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలలో   ఒకేసారి ఎన్నికలుజరిగితే, దక్షిణాది సెంటిమెంట్ మరింగా పండుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే, కర్ణాటకలో జేడీఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో ఇదే విషయంపై మంతనాలు జరిపారని పార్టీ వర్గాల సమాచారం.

మరోవంక మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న ఆంధ్ర్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడుగంటి పోయిన నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు పోవడం మినహా మరో మార్గం లేదని, నిర్ణయానికి వచ్చారు. ఇంత కాలం సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని గంపెడాశ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దిగజారిన ఆర్థిక పరిస్థితితో పాటుగా  వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణల నేపధ్యంలో ముందస్తు ఎన్నికల ఆలోచనకు మరింత పదును పెడుతున్నారని అంటున్నారు. ఓ వంక తెలుగు దేశం పార్టీ పడిలేచిన కెరటంలా దూసుకోస్తోంది. ముందస్తు ఎన్నికను ముందుగానే పసిగట్టిన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా విసురుతున్న సవాలు అధికార వైసీపీలో వణుకు పుట్టిస్తోంది. 

అందుకే గడప గడపకు .. ప్రభుత్వం పేరిట ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన వైసీపీ ఇప్పుడు, సామాజిక న్యాయం పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు బస్సు యాత్ర సాగిస్తున్నారు. నిజమే, గడప గడపకు ... కార్యక్రమంలో ఎదురైన చేదు అనుభవమే, బస్సు యత్రలోనూ కనిపిస్తోంది. గతంలో స్వయంగా జగన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్’ అని జనాలను వేడుకుంటే, ఇప్పడు మంత్రులు సామాజిక న్యాయం ముసుగులో , మరొక్క సారి  జగన్‌ రెడ్డిని ముఖ్యమంత్రికి చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను మంత్రులు వేడుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉండగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు,  కార్యకర్తలు రోడ్డెక్కడం… ముందస్తు ఎన్నికలకు సంకేతమని రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది.  

ముందస్తు ఎన్నికల ఆలోచన మనసులో ఉంది కాబట్టే, ముఖ్యమంత్రి పార్టీ నేతలందరినీ గడపగడపకు పంపడమే కాకుండా.. సామాజిక న్యాయం పేరుతో కొత్తగా పదవులిచ్చిన వారితో యాత్ర కూడా చేయిస్తున్నారు. ఓ రకంగా అది ఎన్నికల ప్రచారమే అనుకోవచ్చు. వచ్చే నెలాఖరులో ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది. అక్కడ గెలిచి  వైసీపీకి తిరుగులేదన్న అభిప్రాయం కల్పించడం కోసం భారీగా ప్రచారం నిర్వహింప చేసుకుని నవంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నారని వైసీపీ నాయకులు చెపుతున్నారు. అదే సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీని రద్దు చేస్తారని, ఆ విధంగా మూడు దక్షణాది రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.