మూడు దక్షినాది రాష్ట్రాలలో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు?

Publish Date:May 28, 2022

Advertisement

కర్ణాటక శాసన సభ గడువు ముగుస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో, ఆ రాష్ట్ర్ర  శాసన సభకు ఎన్నికలు జరగవలసి వుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయా, అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.

నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నిండా రెండేళ్ళ గడువుంది. తెలంగాణ అసెంబ్లీకి సంవత్సరం పైగానే సమయముంది. అయితే,  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజు పెరుగతున్న నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. 
నిజానికి, కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలతో పాటుగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రెంత్ రెడ్డి ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి మొదలు ఆయన ఆలోచనలు స్థిరంగా ఉండడం లేదు. ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు మొదలు, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ఫ్రంట్  ఏర్పాటు వరకు అనేక ఆలోచనలు  చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే సెంటిమెంట్’ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకత కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా ఫలించక పోగా, ఒక్కొక్క ప్రయత్నంతో రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం మరింతగా బయట పడుతోంది. ఉదాహరణకు వరి ధాన్యం కొనుగోలు పై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళన చేసినా, చివరకు రైతుల పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొంటోందని రైతులకు తెలిసి వచ్చింది. చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందని గత ఎనిమిది సంవత్సరాలుగా తెరాస చేస్తున్న ప్రచారంలో ఒక గింజంత నిజం లేదని రైతులకు తెలిసి పోయింది.అందుకే కొత్తగా దక్షణాది వర్సెస్ ఉత్తరాది అనే కొత్త నినాదంతో ముందుకు పోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగా మూడు దక్షణాది రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలలో   ఒకేసారి ఎన్నికలుజరిగితే, దక్షిణాది సెంటిమెంట్ మరింగా పండుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే, కర్ణాటకలో జేడీఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో ఇదే విషయంపై మంతనాలు జరిపారని పార్టీ వర్గాల సమాచారం.

మరోవంక మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న ఆంధ్ర్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడుగంటి పోయిన నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు పోవడం మినహా మరో మార్గం లేదని, నిర్ణయానికి వచ్చారు. ఇంత కాలం సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని గంపెడాశ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దిగజారిన ఆర్థిక పరిస్థితితో పాటుగా  వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, సమీకరణల నేపధ్యంలో ముందస్తు ఎన్నికల ఆలోచనకు మరింత పదును పెడుతున్నారని అంటున్నారు. ఓ వంక తెలుగు దేశం పార్టీ పడిలేచిన కెరటంలా దూసుకోస్తోంది. ముందస్తు ఎన్నికను ముందుగానే పసిగట్టిన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా విసురుతున్న సవాలు అధికార వైసీపీలో వణుకు పుట్టిస్తోంది. 

అందుకే గడప గడపకు .. ప్రభుత్వం పేరిట ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన వైసీపీ ఇప్పుడు, సామాజిక న్యాయం పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు బస్సు యాత్ర సాగిస్తున్నారు. నిజమే, గడప గడపకు ... కార్యక్రమంలో ఎదురైన చేదు అనుభవమే, బస్సు యత్రలోనూ కనిపిస్తోంది. గతంలో స్వయంగా జగన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్’ అని జనాలను వేడుకుంటే, ఇప్పడు మంత్రులు సామాజిక న్యాయం ముసుగులో , మరొక్క సారి  జగన్‌ రెడ్డిని ముఖ్యమంత్రికి చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను మంత్రులు వేడుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉండగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు,  కార్యకర్తలు రోడ్డెక్కడం… ముందస్తు ఎన్నికలకు సంకేతమని రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది.  

ముందస్తు ఎన్నికల ఆలోచన మనసులో ఉంది కాబట్టే, ముఖ్యమంత్రి పార్టీ నేతలందరినీ గడపగడపకు పంపడమే కాకుండా.. సామాజిక న్యాయం పేరుతో కొత్తగా పదవులిచ్చిన వారితో యాత్ర కూడా చేయిస్తున్నారు. ఓ రకంగా అది ఎన్నికల ప్రచారమే అనుకోవచ్చు. వచ్చే నెలాఖరులో ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది. అక్కడ గెలిచి  వైసీపీకి తిరుగులేదన్న అభిప్రాయం కల్పించడం కోసం భారీగా ప్రచారం నిర్వహింప చేసుకుని నవంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి.. వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నారని వైసీపీ నాయకులు చెపుతున్నారు. అదే సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీని రద్దు చేస్తారని, ఆ విధంగా మూడు దక్షణాది రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.