డెల్టా డెత్ గేమ్ స్టార్ట్.. 500 చిన్నారులు మృతి.. 

Publish Date:Jul 26, 2021

Advertisement

ఒకటి కాదు రెండు కాదు. ఒకే  వారంలో ఏకంగా  500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయసు  ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. గత వారంలో 500మంది చిన్నారుల మృతి చెందగా, 50వేల కొత్త కేసులు..ఇండోనేసియా దేశం ఏషియాలోనే డెల్టా వేరియంట్ కే కేంద్రబిందువుగా మారిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అక్కడ రోజురోజు పెరుగుతున్న కేసులు, చావు బతుకలతో బెంబేలెత్తిపోతోందా? ఇండోనేసియాలో కోవిడ్ పేనిక్ సిట్యువేషన్ ఎలా ఉంది?  డెల్టా వేరియంట్ లో-  ఇప్పటికే 27 లక్షల కేసులు వచ్చాయి. అది అలా ఉంచితే  ఒక్క వారంలో 50 వేల కేసులు నమోదు అవ్వడం. ఈ దేశం తన రికార్డులను తానే అధిగమిస్తూ తన చావు తానే ఒంటరిగా ఎదుర్కుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండోనేసియా అని చెప్పాలి.  ఇక్కడ చాలా మంది పరిస్థితి ఏంటంటే.. కరోనా ఒక వైపు కరోనా వచ్చాక ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు అక్కడి ప్రజలు.  ఇలాంటి డెల్టా డెత్ సమాచారం అందుకుంటున్న సిబ్బంది గతంలో ఒకటీ రెండు మాత్రమే దహన సంస్కారాలను చేసేవారు. అదే ఇప్పుడు.. రోజుకు 24 వరకూ అంత్యక్రియలు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.

ఆక్సిజన్ కొరత, కోవిడ్ మరణాలు, ప్రాణాధార ఔషధాల అందలేకపోవడంతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంత వల్లకాడులా మారుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి కొంత వరకు భారత్ బయటపడిందనే చెప్పాలి. అయితే గతంలో  భారత్ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు ఇండోనేషియాలో కనిపిస్తోంది. కరోనా మహమ్మారి విలయతాండవం, అక్కడ కరోనా యముడు ప్రజల ప్రాణాలతో శివతాండవం చేస్తుంది. అయితే ఇప్పుడు సంభవిస్తున్న మరణాల్లో  ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ కరోనా విడతల వారీగా ప్రజలపై తన ప్రభావం చూపిస్తుంది. గతం లో వయసు పై బడిన వారిపై ..ఆ తర్వాత యువకులపై నుంచి ఇప్పుడు ఏకంగా చిన్నారలను కబళిస్తుంది. చిన్నారులను  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోతూ.. స్మశానాల్లో కాలుతున్నారు.  ఇండోనేషియాకు చెందిన వందలాది మంది చిన్నారులు  కోవిడ్ మహమ్మారికి చిక్కి చనిపోయారు. వారిలో చాలా మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇండోనేషియాలో పిల్లల్లో కోవిడ్ మరణాల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా నమోదైంది. ఇక్కడ జూలై నెలలో వారానికి 100 కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇండోనేషియాలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో ఇదే ఎక్కువ అని అక్కడి అధికారులు అంటున్నారు. పిల్లల మరణాల సంఖ్య పెరుగుదల ఆగ్నేయాసియాలో డెల్టా వేరియంట్ కేసులతో సమానంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఇండోనేషియా ప్రభుత్వం దేశీయ మొత్తం జనాభాలో దాదాపు 50వేల కొత్త కేసులు నమోదు కాగా.. 1,566 మరణాలు నమోదయ్యాయి.

శిశువైద్యుల ఇచ్చిన నివేదికల ప్రకారం.. ఆ దేశంలో కోవిడ్ కేసులలో మునుపటి నెలతో పోలిస్తే… చిన్నారులు 12.5శాతంగా ​ఉన్నారు. జూలై 12న కరోనాతో 150 మందికి పైగా చిన్నారులు చనిపోయారు.  గత వారంలో 500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. మొత్తంమీద.. ఇండోనేషియాలో 3 మిలియన్లకు పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా, 83వేల మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది నుంచి ఇండోనేషియాలో 18ఏళ్ల కంటే తక్కువ వయస్సులో 800 మందికి పైగా చిన్నారులు కరోనా రక్కసికి చిక్కారు.

కోవిడ్ మరణాలలో ఎక్కువ భాగం గత నెలలోనే నమోదయ్యాయని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశంలో తక్కువ టీకా రేటు కూడా దీనికి కారణమనేది ఇక్కడి వారి రిపోర్టులో వెల్లడైంది. ఇండోనేషియాలో కేవలం 16శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందినట్లుగా తెలుస్తోంది. మరో 6శాతం మందికి మాత్రమే రెండో డోస్ వేయించుకున్నవారి సంఖ్య ఉంది. కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రులన్నీ వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సోకిన చిన్నారుల సంరక్షణ కోసం కొన్ని ఆస్పత్రులను ప్రత్యేకంగా  ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిలలను రక్షించుకునేందుకు వారి ఉరుకులు పరుగులు చూస్తుంటే మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏ దేశానికైనా విపత్తు వచ్చినప్పుడు మన దేశం ఎప్పుడు ముందే ఉంటుంది.. మన దేశం ఎప్పుడు ముందే ఉంటుందని మరో నిరూపించింది. తాజాగా భారత్ తన మిత్ర దేశానికి చేయూతనిస్తోంది. ఇప్పటికే 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు పంపించింది. భారత నావికాదళానికి చెందిన ఓ నౌకలో వీటిని ఇండోనేషియా రాజధాని జకార్తా తరలించారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే సంపన్న సీఎం. గత ఏడాది ఏప్రిల్ లో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొన్న మేరకు 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే సంపన్నుడిగా తేలారు.
చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.
పంచ్ డైలాగుల నుంచి పలాయనం దాకా వైసీపీ తిరోమన ప్రస్ధానం చేరుకుందా అంటే కడప జిల్లా రాజకీయాలలో జరుగుతున్న లేదా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తోంది. పులివెందుల పులి, సింహం సింగిల్ ఎంట్రీ వంటి డైలాగుల నుంచి తమపై ఎవరూ ఆరోపణలూ విమర్శలూ చేయకూడదంటూ కడప కోర్టు నుంచి తెచ్చుకునే వరకూ వైసీపీ వచ్చింది.
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి,
బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.