Top Stories

political-news-img

బాలానగర్‌లో లారీ కిందపడి చిన్నారి దుర్మరణం..!

మామతో బైక్‌పై వెళ్లి లారీ కిందపడిన చిన్నారి..! ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు.. ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా రాలేదు. మామతో కలిసి బైక్‌పై సంతోషంగా వెళ్తున్న ఆ చిన్నారి.. ఊహించని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. క్షణకాలంలో జరిగిన ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మేడ్చల్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్–1లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పద్మనగర్ ఫేజ్–1కు చెందిన వేదశ్రీ (4) తన మామతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తోంది. మామతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా వెళ్తున్న చిన్నారికి అంతలోనే ఊహించని ప్రమాదం ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న లారీ సమీపంలోకి బైక్ రావడంతో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ టైర్ కింద పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి వేదశ్రీ లారీ చక్రాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. క్షణాల్లోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటివరకు మామతో కలిసి సంతోషంగా ప్రయాణించిన చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అక్కడి వాతావరణం విషాదంగా మారింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది? ద్విచక్ర వాహనం లారీ టైర్ కిందకు వెళ్లడానికి కారణమేంటి? ప్రమాద సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రహదారులపై వాహనాలు నడిపే సమయంలో మరిం Child dies after being hit by lorry, Balanagar, Padmanagar Phase-1, Vedashree, Crime news, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police

Publish Date: Aug 2, 2026 5:23PM

political-news-img

సాయికృష్ణ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. అతని కోసమే సిట్ వేట..!

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ సంచలనాత్మక వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న సురేశ్ ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీవ్రంగా గాలిస్తోంది. కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న సురేశ్ గురించి సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని కోరుతూ సిట్ అధికారులు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో ప్రైవేటు వ్యక్తి అయిన సురేశ్ పాత్ర అత్యంత కీలకమని తెలుస్తోంది. కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో ఈ సాయికృష్ణ వ్యవహారం నడిచిన సమయంలో సురేశ్ పెత్తనం సాగించాడని విచారణలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ (సిఐ) నాగరాజుకు సురేశ్ అత్యంత సన్నిహితుడు కావడంతో, పోలీసు విభాగంతో సంబంధం లేకపోయినా స్టేషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవాడని సమాచారం. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న నాటి నుంచి, అతని మృతి చెందడం, అనంతరం శవాన్ని మాయం చేయడం వరకు ప్రణాళికాబద్ధంగా జరిగిన ప్రతీ అంశం సురేశ్‌కు క్షుణ్ణంగా తెలుసని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంచలన కేసు తీవ్రరూపం దాల్చకముందే, ప్రాథమిక విచారణ సమయంలోనే సిట్ అధికారులు సురేశ్‌ను పలుమార్లు పిలిపించి విచారించారు. ఆ సమయంలో అతడి నుంచి కొన్ని ముఖ్యమైన వివరాలను రాబట్టారు. సాయికృష్ణను పోలీసు స్టేషన్ నుంచి బయటకు ఎందుకు తీసుకెళ్లారు? అతడిని బయటకు ఎవరు తీసుకెళ్లారు? నగరం పరిధిలోని ఎక్కడెక్కడ తిప్పారు? ఆ తర్వాత తిరిగి ఎప్పుడు స్టేషన్‌కు తీసుకొచ్చారు? అన్న కీలకమైన అంశాలపై అధికారులు సురేశ్ నుంచి వివరాలు సేకరించారు. ఆ విచారణ సమయం వరకు సహకరించినట్లే కనిపించిన సురేశ్, ఈ కేసులో అతడి పేరును ఎ4 నిందితుడిగా పేర్కొంటూ అధికారికంగా నమోదు చేయగానే పసిగట్టి పరారయ్యాడు. సిఐ నాగరాజుకు నీడలా ఉంటూ, ఈ అమానుష ఘటనలో ప్రధాన పాత్ర పోషించిన సురేశ్ దొరికితేనే సాయికృష్ణ మృతి వెనుక దాగి ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారుల నిజస్వరూపం బయటపడుతుందని భావిస్తున్నారు. పోలీసు స్టేషన్ వేదికగా ఒక ప్రైవేటు వ్యక్తి అంతగా పెత్తనం చెలాయించడం, మృతదేహాన్ని మాయం చేసేంతవరకు సహకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎ4 నిందితుడు సురేశ్ కోసం సిట్ అధికారులు పలు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతడి జాడ తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు లేదా సిట్ అధికారులకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని కోరారు. ఈ కేసులో ముందుముందు ఇంకెన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయోనని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. Saikrishna death case, Vijayawada SIT notice, Accused Suresh A4, Krishnalanka police station, AP crime news, Vijayawada rowdy sheeter case

Publish Date: Aug 2, 2026 5:05PM

political-news-img

కర్ణాటకలో కొండచరియలు విరిగిపడి.. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి..!

కర్ణాటక వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మల్నాడు ప్రాంతంతో పాటు కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానల ధాటికి కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిద్రలోనే ఊపిరి వదిలారు. శివమొగ్గ జిల్లాలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో నిమిషాల వ్యవధిలోనే ఒక హాయిగా సాగుతున్న పేద కుటుంబం మట్టిదిబ్బల కింద సమాధి అయిపోయింది.బాధితుల వివరాల్లోకి వెళితే.. కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా కొక్కరెగర గ్రామానికి చెందిన మల్లికార్జున్ (35) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి శివమొగ్గకు వచ్చారు. ఆయన తన భార్య నాగవేణి (28), మూడేళ్ల కుమారుడు సంతోష్ (3) లతో కలిసి ఇందిరానగర్ సమీపంలోని కొండ దిగువన నిర్మించుకున్న ఒక చిన్న రేకుల షెడ్డులో నివాసముంటున్నారు. శనివారం రాత్రి అంతా బయట ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పనులన్నీ ముగించుకుని కుటుంబమంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. అయితే తెల్లవారుజామున రాబోయే ప్రమాదాన్ని ఆ నిరుపేద కుటుంబం ఊహించలేకపోయింది.ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయాన వర్షపు నీటికి నానిన కొండ భాగం భారీ శబ్దంతో ఒక్కసారిగా విరిగిపడింది. భారీగా మట్టి దిబ్బలు, పెద్ద పెద్ద రాళ్లు కింద ఉన్న మల్లికార్జున్ రేకుల షెడ్డుపై పడ్డాయి. నిద్రమత్తులో ఉన్న ఆ కుటుంబం తేరుకునే లోపే రేకుల షెడ్డు పూర్తిగా నజ్జునజ్జై మట్టి కుప్ప కింద కూరుకుపోయింది. చిన్నారి సంతోష్‌తో సహా మల్లికార్జున్, నాగవేణిలు ఊపిరాడక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల పసికందు మట్టిక్రింద ప్రాణాలు విడవడం ఘటనా స్థలానికి చేరుకున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.ఈ ప్రమాద తీవ్రత పక్కనే ఉన్న మరొక రేకుల షెడ్డుపై కూడా పడింది. పక్క షెడ్డుపై పెద్ద రాళ్లు వచ్చి పడటంతో అందులో ఉన్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉలిక్కిపడిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల విభాగం, పోలీసు బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే రెస్క్యూ సిబ్బంది వెలికితీసి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.అనంతరం మట్టి కుప్పల కింద చిక్కుకుపోయిన మల్లికార్జున్ కుటుంబ సభ్యుల మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీల సాయంతో గంటల తరబడి శ్రమించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొండచరియలు విరిగిపడటంతోనే ఈ ఘోరం జరిగిందని శివమొగ్గ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. మల్నాడు ప్రాంతంలో వర్షాలు మరింత ముదిరే అవకాశం ఉండటంతో కొండ దిగువన మరియు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.ఈ విషాద సంఘటనతో మల్లికార్జున్ స్వగ్రామమైన కొక్కరెగరతో పాటు ఇందిరానగర్‌లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబాన్ని వర్షాల రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Karnataka Landslide, Shivamogga Rain Disaster, Karnataka Rains Update, Landslide Kills Three, Indira Nagar Landslide, Malnad Heavy Rains

Publish Date: Aug 2, 2026 4:39PM

political-news-img

స్టీరింగ్ పట్టిన మైనర్.. క్షణాల్లో అదుపు తప్పిన కారు.. బైక్‌లపై బీభత్సం..!

యూసఫ్ గూడలో కారు బీభత్సం..ఇద్దరికి తీవ్ర గాయాలు..! కారు తాళాలు కారులోనే ఉన్నాయి.. డ్రైవింగ్‌పై అనుభవం లేదు.. అయినా సరే స్టీరింగ్ పట్టుకున్నాడు. కారు ముందుకు కదిలిన కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వరుసగా బైక్‌లను డీ కొట్టుకుంటూ దూసుకె ళ్లింది. చివరకు రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. యూసఫ్ గూడ కార్మికనగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎల్లార్ కిషోర్ హైస్కూల్ సమీపంలో ఉదయం సాధారణంగానే రాకపో కలు సాగుతున్నాయి. రోడ్డుపక్కన కొన్ని ద్విచక్ర వాహనాలను వరుసగా నిలిపి ఉంచారు. ఇంతలో వేగంగా వచ్చిన బలెనో కారు ఒక్కసారిగా అదుపు తప్పి వరుసగా నిలిపి ఉంచిన ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఒక్కసా రిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అక్కడికి చేరుకున్న వారికి ధ్వంసమైన బైక్‌లు, రోడ్డుపై పడిపోయిన బాధితులు కనిపించారు. బైక్‌పై కార్మికనగర్‌కు చెందిన సోదరులు రాజ్‌కుమార్ (60), ప్రభాకర్ (55) ప్రయాణిస్తు న్నారు. ఇద్దరూ కలిసి చర్చికి వెళ్తుండగానే కారు అత్యంత వేగంగా వెళ్లి వారి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆస్ప త్రులకు తరలించారు. రాజ్‌కుమార్‌ను మాక్స్ ఎయిడ్ ఆస్పత్రికి, ప్రభాకర్‌ను స్టార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. పోలీసుల ప్రాథ మిక దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బోరబండకు చెందిన అలీ అహ్మద్ ఖాన్(17) ఈ కారును నడిపినట్లు తెలుస్తోంది. అతని స్నేహితుడు అద్దెకు తీసుకున్న కారును శుభ్రం చేసిన అనంతరం తాళాలు కారులోనే వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో డ్రైవింగ్‌లో అనుభవం లేని అలీ అహ్మద్ ఖాన్ కారు నడిపేందుకు ప్రయత్నించాడు. కారు స్టార్ట్ చేసిన తర్వాత అదుపు కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షణాల్లోనే కారు అదుపు తప్పి ఏడు బైక్‌లను ఢీకొట్టడం, ఆపై రోడ్డుపై వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంతో మరోసారి మైనర్లు వాహనాలు నడపడం, వారికి వాహనాలు అందుబా టులోకి రావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కారు ఎవరి పేరుతో అద్దెకు తీసుకున్నారు? మైనర్‌కు కారు తాళాలు ఎలా అందాయి? అతడు డ్రైవింగ్ చేస్తున్న విషయం స్నేహితులకు లేదా వాహన యజమానికి తెలుసా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. Yusuf Guda Karmikanagar, Car accident, Ali Ahmed Khan, Crime news, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police

Publish Date: Aug 2, 2026 4:17PM

political-news-img

చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.6 కోట్లు వసూలు చేసి పరార్..!

తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక చిట్టీల పేరుతో మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బుద్వేల్‌లో చిట్టీల పేరుతో సుమారు రూ.6 కోట్లు వసూలు చేసిన ఆశోక్‌ అనే వ్యక్తి రాత్రికి రాత్రే ఇంటిని ఖాళీ చేసి పరారైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌ గ్రీన్‌సిటీ కాలనీ ప్రాంతానికి చెందిన ఆశోక్‌ అనే వ్యక్తి అదే ప్రాంతంలోని ఐఎంఆర్‌ మిల్లెట్‌ స్టేషన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత సుమారు 20 ఏళ్లుగా బుద్వేల్‌ గ్రీన్‌సిటీ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా చిన్న మొత్తాలతో చిట్టీల నిర్వహణ ప్రారంభించాడు. మొదట్లో ఆశోక్‌పై స్థానికులకు పెద్దగా అనుమానాలు లేకపోయాయి. చిట్టీలు పూర్తయిన తర్వాత సభ్యులకు వారి డబ్బులు తిరిగి చెల్లిస్తూ క్రమంగా నమ్మకం సంపాదించు కున్నాడు. ఇలా కొన్నేళ్ల పాటు చిట్టీలు నిర్వహిం చడంతో కాలనీలో చాలామంది అతని పూర్తిగా నమ్మి అతని వద్ద చిట్టీలు వేశారు.అయితే చిట్టీలు పూర్తయిన తర్వాత చేతికి వచ్చిన డబ్బును తన వద్దే ఉంచితే నెలకు 2 శాతం వడ్డీ ఇస్తానంటూ ఆశోక్‌ పలువురిని నమ్మించాడు. దీంతో చిట్టీ డబ్బులతో పాటు పలువురు తమ వద్ద ఉన్న సొమ్మును కూడా అతనికి ఇచ్చారు. కొంతకాలం పాటు తీసుకున్న డబ్బుకు వడ్డీలు చెల్లిస్తూ నమ్మకం కలిగించాడు.. దీంతో మరింత మంది పెద్ద మొత్తాలను అతని వద్ద పెట్టారు. ఇలా చిట్టీల సొమ్ముతో పాటు వడ్డీకి తీసుకున్న డబ్బులు కలిపి సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేశాడు. ఈ నెలలో పలువురి చిట్టీలు ముగియను న్నాయి. దీంతో చిట్టీ డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో బాధితులు ఆశోక్‌ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆశోక్‌ కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి పరారైనట్లు తెలుసుకున్న బాధితులు లబోదిబో మంటూ కన్నీరు మున్నీరయ్యారు. తమ జీవితకాల సంపాదనను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపో యామని గ్రహించిన బాధితులు పెద్ద సంఖ్యలో ఆశోక్‌ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. "పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కట్టాం.. డబ్బులు తిరిగి వస్తాయనుకున్న సమయంలో అశోక్ పరారయ్యాడు" అంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబ అవసరాల కోసం కష్టపడి సంపాదించిన డబ్బును చిట్టీల్లో పెట్టామని, ఇప్పుడు ఆ సొమ్మంతా పోయిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆశోక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఈ ఘటనపై బాధితులు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిట్టీల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి పరారైన ఆశోక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అనధికారిక చిట్టీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులు తిరిగి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరుతున్నారు.ఆశోక్‌ పరారైన నేపథ్యంలో అతని ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు, ఆరోపణల ఆధారంగా అసలు ఎంత మొత్తం వసూలు చేశాడు? ఎక్కడికి వెళ్లాడు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారణ జరగాల్సి ఉంది. Rajendranagar, Budvel Green City, Ashok, Fraud, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police

Publish Date: Aug 2, 2026 3:35PM

political-news-img

ఫ్రెండ్‌షిప్ డే వేళ విషాదం.. బీచ్‌లో అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు..!

స్నేహబంధానికి ప్రతీకగా నిలిచే ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు ఒకే కుటుంబంలో ఆరని శోకాన్ని మిగిల్చాయి. విశాఖపట్నంలోని ప్రసిద్ధ గంగవరం బీచ్ తీరంలో ఆదివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాణస్నేహితులతో కలసి ఆనందంగా గడపడానికి, ఫ్రెండ్‌షిప్ డేని సంతోషంగా జరుపుకోవడానికి తీరానికి వచ్చిన యువకుల ముఠాలో ఇద్దరు సముద్రపు అలల ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సరదాగా సాగిన విహారయాత్ర నిమిషాల వ్యవధిలోనే తీరని విషాదకర సంఘటనగా మారిపోవడంతో ఆ ప్రాంతమంతా బాధితుల రోదనలతో మిన్నంటింది. నగరానికి చెందిన దాదాపు 6 మంది స్నేహితుల బృందం ఆదివారం ఉదయం ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా గంగవరం బీచ్‌కు చేరుకుంది. పండగ వాతావరణంలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తీరంలో కేరింతలు కొడుతూ సరదాగా సమయాన్ని గడిపారు. సముద్ర అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతున్న సమయంలో, కొందరు ఉత్సాహంతో నీటిలోకి దిగారు. తీరం వెంబడి రాకాసి అలలు ఎగిసిపడుతున్నప్పటికీ, ప్రమాదాన్ని ఊహించలేక లోతుపాతు తెలియని నీటిలో ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో ఊహించని విధంగా వచ్చిన ఒక పెద్ద కెరటం ఇద్దరు యువకులను ఒక్కసారిగా లోపలికి లాక్కెళ్లిపోయింది. నీటి ఉధృతి చాలా ఎక్కువగా ఉండటంతో ఈత వచ్చినప్పటికీ నిమిషాల వ్యవధిలోనే వారు సముద్ర గర్భంలో మునిగిపోయారు. తోటి స్నేహితులు వారిని కాపాడేందుకు ఆర్తనాదాలు చేస్తూ శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, అలల రాకాసి వేగం ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. కళ్లముందే తమ ప్రాణస్నేహితులు నీటి అలల్లో కొట్టుకుపోతుంటే మిగిలిన మిత్రులు తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే గంగవరం మెరైన్ పోలీసులు, స్థానిక కోస్ట్ గార్డ్ బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం దాదాపు 3 ప్రత్యేక రెస్క్యూ బోట్లు, అనుభవజ్ఞులైన ఈతగాళ్లతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉండటం, తీరం వెంట బలమైన గాలులు వీస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు 4 గంటలకు పైగా నిరంతరాయంగా గాలింపు చేపట్టినప్పటికీ, అలల వేగానికి యువకులు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు గంగవరం బీచ్ తీరానికి పరుగులు తీశారు. తమ పిల్లల ఆచూకీ కోసం తీరం వెంబడి వారు చేస్తున్న ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేశాయి. పండగ పూట ఆనందంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డలు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా, డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా సముద్ర తీరప్రాంతాల్లో శోధిస్తున్నారు. విశాఖపట్నం తీరప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం పట్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం మరియు వాయుగుండాల ప్రభావం ఉన్న సమయంలో సముద్రంలో అలల ఉధృతి 2 నుండి 3 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతుందని, ఇలాంటి సమయంలో నీటిలోకి దిగడం అత్యంత ప్రమాదకరమని మెరైన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. బీచ్‌లలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ, సందర్శకులు నిర్లక్ష్యంతో నీటిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన ప్రతి ఒక్కరికీ ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తోంది. సముద్ర విహారయాత్రలకు వెళ్లే యువత, పర్యాటకులు తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా ప్రాణాపాయం ఉన్న ప్రాంతాల్లో సాహసాలు చేయకూడదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబాల్లో పూడ్చలేని లోటును మిగుల్చుతుందని, ఫ్రెండ్‌షిప్ డే లాంటి ఆనందకరమైన రోజున ఇటువంటి విషాదం జరగడం నిజంగా అత్యంత విచారకరమని స్థానికులు పేర్కొంటున్నారు. గల్లంతైన యువకుల సమాచారం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. Visakhapatnam Beach Tragedy, Gangavaram Beach Incident, Friendship Day Tragedy Vizag, Youths Swept Away Vizag, Vizag Marine Police Search, Visakhapatnam News Today

Publish Date: Aug 2, 2026 3:24PM

MOVIE NEWS