జగన్ తో ఆర్. కృష్ణయ్య భేటీ.. అందుకేనా?

 


తెలంగాణ టీడీపీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో లోటల్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని.. పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని తాను జగన్‌ను కోరానని చెప్పారు. దీనికి జగన్ అనుకూలంగా స్పందిచారని.. వారంలోపులో లేఖ రాస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంకా కాపు రిజర్వేషన్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని.. కాపులను బీసీల్లో చేర్చితే బీసీలు నష్టపోతారని ఆయన ఆరోపించారు. మరోవైపు కృష్ణయ్య, జగన్ భేటీలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పెద్దలు.. కృష్ణయ్య చెప్పినట్టు రిజర్వేషన్ల నేపథ్యంలోనే భేటీ అయ్యారా.. లేక ఇంకా ఏదైనా మతలబు ఉందా అంటూ సందేహిస్తున్నారు.