Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వివేకా హత్య పై బహిరంగ చర్చకు సిద్ధమా...అవినాష్కు బీటెక్ రవి సవాల్
posted on: Mar 20, 2026 8:09PM
.webp)
మాజీ మంత్రి వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. వివేకా హత్యకేసు నిజా నిజాలు ప్రజలపై మాట్లాడేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్య జరిగిన ప్రదేశాన్ని మార్చడం, రక్తపు మరకలను శుభ్రం చేయించడం వంటి చర్యల వెనుక అవినాష్ రెడ్డి పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. వివేకా మరణాన్ని గుండెపోటుగా చూపించే ప్రయత్నం దేశమంతా చూసిందని, దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
అయితే ఇప్పుడు అదే విషయాన్ని సునీతపై నెట్టివేయడం అసత్య ప్రచారమని ఆయన విమర్శించారు. రక్తపు మరకలను తొలగించిన వారిని కాపాడేందుకే అవినాష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. గత ఎన్నికల్లో సునీత, సౌభాగ్యమ్మలు పోటీకి ఒప్పుకోకపోతే అవినాష్ రెడ్డి రాజకీయంగా ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. ఎంపీ పదవి కూడా సునీత కారణంగానే వచ్చిందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సవాల్ విసిరారు. ఈ కేసులో పూర్తి సత్యాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.



.webp)


