Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయవాడలో ఔటర్ రింగ్రోడ్ పనులు త్వరలో ప్రారంభం...
posted on: Sep 24, 2014 5:36PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దేశమంతా విజయవాడ వైపు ఆసక్తిగా చూస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధానిగా విజయవాడ పరిసరాలు సాధించే అద్భుతమైన ప్రగతిని దేశమంతా ఊహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరానికి కంఠహారంలా నిలిచే ఒక అద్భుతమైన ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆ ప్రాజెక్టు మరేదో కాదు... విజయవాడ ఔటర్ రింగ్రోడ్. అయితే ‘విజయవాడ ఔటర్ రింగ్రోడ్’ అంటే తాజాగా ప్రభుత్వం సంకల్పించిన విజయవాడ, గుంటూరు తెనాలి, మంగళగిరి (వీజీటీఎం)లను కలిపే రింగ్రోడ్ అనుకునే అవకాశం వుంది. కానీ ఈ ఔటర్ రింగ్రోడ్ అది కాదు. ఇది ఎప్పటి నుంచో ప్రతిపాదనలో వుండి, కాంట్రాక్ట్ ఒప్పందాలు కూడా పూర్తయిన విజయవాడ బైపాస్ ఔటర్ రింగ్ రోడ్. వీజీటీఎం పరిధిలో నిర్మించే భారీ ఔటర్ రింగ్ రోడ్డు కంటే నిర్మాణం పూర్తి చేసుకునే ప్రాజెక్టు.
ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల విజయవాడ నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి బాగా తగ్గే అవకాశం వుంది. ఈ రోడ్డు నిర్మాణానికి 2009 సంవత్సరంలోనే ప్రభుత్వ వర్గాలు శ్రీకారం చుట్టాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోడ్డును నిర్మిస్తారు. నేషనల్ హైవే నంబర్ 5 మీద వున్న మంగళగిరి నుంచి నేషనల్ హైవే నంబర్ 9 మీద వున్న గొల్లపల్లి వరకు నున్న, ముస్తాబాద్ మీదుగా గన్నవరం సమీపంలోని పెద్ద అవుటపల్లి మీదుగా వెళ్ళే ఈ రోడ్డు పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను వరకు వుంటుంది. ఈరోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడం మాత్రమే కాకుండా. ఈ బైపాస్ రోడ్డు ఉన్నంత మేర అద్భుతమైన అభివృద్ధి జరిగే అవకాశం వుంది. ఈ ప్రాజెక్టుకు 1,664 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. గామన్ ఇండియా సంస్థ కాంట్రాక్టును కూడా దక్కించుకుంది. పదిహేను రోజుల్లో ఈ రోడ్డుకు సంబంధించిన పనులు మొదలయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.


.jpg)



