Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్టీసీ బస్సు..లారీ ఢీ.. ఇద్దరు మృతి
posted on: Jun 22, 2026 11:01AM

తిరుపతి జిల్లాలో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలూ కూడా అతి వేగంతో ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రమాదంలో మృతులను ఏడాది వయస్సున్న పునీత్ సాయి, శ్రీకాళహస్తికి చెందిన 16 ఏళ్ల యశ్వితగా గుర్తించారు.


.webp)



