చంద్రగ్రహణం.. శ్రీవారి ఆలయం మూత

posted on: Mar 3, 2026 11:14AM

చంద్రగ్రహణం కారణంగా  తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ ఉదయం మూసివేశారు. గ్రహణ ప్రభావం దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో రేపు నిర్వహించాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు.

తిరుపతిలో జారీ చేసే   సర్వదర్శనం టోకెన్ల కోటాను కూడా నిలిపివేశారు.  గ్రహణ సమయం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయ తలుపులు మూసివేశారు.  రాత్రి ఏడున్నర గంటలకు ఆలయాన్ని తెరిచి, ఆలయ శుద్ధి,  పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి ఎనిమిదిన్నర నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...