Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిల్లలు బాగా చదవాలంటే.. స్టడీ టేబుల్ పై ఈ వస్తువులు తీసేయండి..!
posted on: Apr 2, 2026 11:53AM

నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్ఫోన్లు, గేమ్లు, సోషల్ మీడియా, మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల ఏ విధమైన ఆటంకం లేకుండా, శ్రద్దగా చదువుకోవాలంటే వారికి జ్ఞాపకశక్తి కూడా మెరుగ్గా ఉండాలి. ముఖ్యంగా స్టడీ టేబుల్పై వారి ఏకాగ్రతను దెబ్బతీసే వస్తువులు ఉంటే, వారు ఎంత కష్టపడి చదివినా ఏకాగ్రత తక్కువగానే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా చదువు మీద దృష్టి పెట్టలేరు. ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వారు చదువుకునే ప్రదేశంలో లేదా స్టడీ టేబుల్పై ఉంచకూడని ఐదు వస్తువులు ఉన్నాయి. అవేంటో.. వాటిని ఎందుకు చదువుకొనేటప్పుడు పిల్లలకు దగ్గరగా ఉంచకూడదో తెలుసుకుంటే..
మొబైల్ ఫోన్..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లల ఏకాగ్రతను బాగా దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్లు, గేమ్స్, వీడియోలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఫోన్ను టేబుల్పై దూరంగా ఉంచినప్పటికీ, పిల్లల మనసు పదే పదే నోటిఫికేషన్ల కోసం చూస్తూ ఉంటుంది. దీనివల్ల వారి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందువల్ల, చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్ను వేరే చోట ఉంచాలి. మరీ ముఖ్యంగా నేటికాలంలో టీనేజ్ పిల్లలకు కూడా సపరేట్ గా ఫోన్ లు కొనివ్వడం పెద్దలు చేస్తున్న తప్పు. చిన్నతనం నుండే పిల్లలకు ఫోన్ విషయంలో మంచి క్రమశిక్షణ పెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పిల్లల మనసు చదువుపైన దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది.
స్నాక్స్..
చదువుకునే బల్లపై లేదా చదువుకునే ప్రదేశంలో చిప్స్, చాక్లెట్, శీతల పానీయాలు వంటివి ఉంచడం కూడా మంచిది కాదు. పిల్లలు చదువుకునేటప్పుడు తినేస్తుంటారు, దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలుగుుతంది. జంగ్ ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. దానికి బదులుగా, పిల్లలను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడానికి బల్ల దగ్గర పండ్లు, నీళ్లు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్, ఒక గ్లాసు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి.
స్టేషనరీ..
పిల్లలు తరచుగా పెన్నులు, పెన్సిళ్లు, మార్కర్లు , పోస్ట్-ఇట్ నోట్లను బల్లలపై వదిలేస్తుంటారు. దీనివల్ల స్టడీ టేబుల్ చిందరవందరగా, అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఈ మానసిక గందరగోళం ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, బల్లపై కేవలం అత్యవసరమైన పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్లను మాత్రమే ఉంచాలి. ఇతర స్టేషనరీని అల్మరాలో లేదా డ్రాయర్లో భద్రపరచాలి.
గేమింగ్ పరికరాలు..
టేబుల్పై గేమింగ్ కన్సోల్, హ్యాండ్హెల్డ్ గేమింగ్ పరికరం లేదా కంట్రోలర్ను ఉంచడం వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. గేమింగ్ పరికరాన్ని చూడగానే పిల్లలకు ఆడాలనే కోరిక కలిగే అవకాశం ఎక్కువ. దీనివల్ల చదువుకునే సమయం తగ్గి, వారి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. గేమింగ్ పరికరాలను వేరే గదిలో లేదా అల్మరాలో ఉంచాలి.
కోట్స్..
గెలుపుకు బోలెడు మార్గాలు ఉంటాయి. కొందరు భయంతో గెలవాలని ప్రయత్నం చేస్తారు. చాలామంది పిల్లలకు బాగా చదువుకుని మార్కులు బాగ తెచ్చుకోవాలని ఉన్నా, ఏదో బలహీనత వారిని వెనక్కు లాగుతూ ఉంటుంది. ఈ కారణంగా భయంతో చదువు వైపు ఏకాగ్రత పెట్టడానికి కొన్ని కోట్స్ రాసిన స్టిక్కర్స్ పెట్టుకుంటారు. కానీ భయంతో చదివే చదువుకంటే.. ఇష్టంతో చదివే చదువు చాలా బాగా గుర్తుంటుంది. అందుకే చదువుకోవడాన్ని ప్రేరేపించే విదంగా ఉండే కోట్స్ ను స్టడీ టేబుల్ లేదా చదువుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇది మరింత మెరుగ్గా చదవడానికి సహాయపడుతుంది.
చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు పైన చెప్పుకున్నవి పాటించడం వల్ల పిల్లలు చదువులో మరింత మెరుగ్గా ముందుకెళతారు.
*రూపశ్రీ.






