ఒకే సారి మూడు నెలల రేషన్!

posted on: Mar 5, 2026 12:56PM

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిలో  రేషన్ కార్డు లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకుకు ఏప్రిల్ నెలలో ఒకే సారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని సరఫరా  చేయనుంది.  

వేసవిలో   ఎండల్లో గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద వేచి ఉండి జనం ఇబ్బందులు పడకండా ఉండేందుకు కేంద్ర పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  సాధారణంగా ఏ నెల రేషన్ బియ్యం ఆ నెలే సరఫరా చేస్తారు. కానీ ఈ సారి వేసవి తీవ్రత అధికంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం  ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ బియ్యాన్నీ ఒకే విడతలో ఏప్రిల్ లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసింది.  మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కేంద్రం నిర్ణయం పట్ల ప్రజలలో హర్షం వ్యక్తం అవుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...