తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా

హైద్రాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి వచ్చే మే 1తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్డ్ విడుదల చేసింది.  ఈ నెల 28 నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ  నోటిఫికేషన్తో మొదలవుతుంది. వచ్చే  నెల 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న మజ్లిస్ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఏప్రిల్ నాలుగో తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  అదే నెల ఏడో తేదీన నామినేషన్ల స్కూట్ని ఉంటుంది. ఏప్రిల్ 9 వతేదీ వరకు   నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.  ఏఫ్రిల్ 23న పోలింగ్ , 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.