Top Stories

ఏపీ మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా నటి మీనాక్షీ చౌదరి!

తెలుగులో ప్రస్తుతం స్టార్ స్టేటస్ సాధించి వరుస సినిమాలతో దూసుకుపోతున్న మీనాక్షీ చౌదరి ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెను రాష్ట్ర మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. స్వల్పం కచాలంలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరిన మీనాక్షీ చౌదరి ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినీమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇచ్చట వాహనాలు నిలుపరాదు అన్న సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మీనాక్షి చౌదరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. ఖిలాడీ, హిట్, గుంటూరు కారం సినిమాలతో ఓ మోస్తరు గుర్తింపు పొందిన మీనాక్షి చౌదరి, లక్కీ భాస్కర్ సినిమాతో టాప్ హీరోయిన్ గా మారిపోయారు. ఆ వెంటనే విడుదలైన సంక్రాతికి వస్తున్నాం సినిమాతో ఆమె ఇక తిరుగులేని స్టార్ డమ్ సాధించారు. ఇప్పుడు ఆమెను ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్ర మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనుంది. అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు.  
ఏపీ మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా నటి మీనాక్షీ చౌదరి! Publish Date: Mar 2, 2025 10:54AM

శంభో శివ శంభో, ఇవేమి బంధాలు శివ శంభో

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కమర్షియల్ గా మారిపోతున్నాయి. అనుబంధాలు, ఆత్మీయత అన్న మాటలు చరిత్రగర్భంలో కలిసిపోతున్నాయి. తల్లీ, తండ్రీ, భర్త, భార్య, పిల్లలు అన్న బంధాలనే లెక్క చేయని తరం ఒకటి మొదలైంది. చిన్న చిన్న మొత్తాల కోసమే ఒకరినొకరు తెగనరుక్కునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సొమ్ములు ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే హతమార్చిన కొడుకు.. ఆస్తిపై పెత్తనం ఇవ్వడం లేదన్న కక్షతో తాతను తెగనరికిన మనవడు.. తన జల్సాలకు అడ్డువస్తోందన్న కోపంతో భార్యను హతమార్చిన భర్త, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఇలా దాదాపు ప్రతి రోజూఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటోంది. తాజాగా భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన భార్య ఉదంతం ఒకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమంలో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడిన వివాహిత భర్తా జయరాజ్, ఇద్దరు పిల్లలను వదిలేసి చెప్పాపెట్టకుండా ప్రియుడితో లేచిపోయింది. భార్య ఏమైందో తెలియక వెతికి వెతికి వేసారిన భర్త జయరాజ్ పోలీసులకు భార్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ పేట్ బషీర్ బాగ్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. భార్య, ఆమె ప్రియుడు బైక్ పై జల్సాగా వెడుతూ భర్త కంటే పడ్డారు. దీంతో వారిని వెంబడించాడు. దీంతో వారు బైక్ వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి పారిపోయారు. దీంతో భర్త విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు. 
శంభో శివ శంభో, ఇవేమి బంధాలు శివ శంభో Publish Date: Mar 2, 2025 9:19AM

రోజాకేమైంది.. ఆ ట్వీట్ వెనుక అర్దమేంటి?

మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆమె మాటలూ, చేష్టలూ అన్నీ సంచలనమే. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రోజా ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఆ తరువాత కాంగ్రెస్ గూటికి అక్కడ నుంచి వైసీపీకి మారారు. వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రోజా, జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు.  రాజకీయ ప్రత్యర్థులపై రోజా చేసే వ్యాఖ్యలు, ఆమె ఉపయోగించే భాష కారణంగా ఆమె తరచూ వివాదాస్పదం అవుతూనే ఉంటాయి.  అటువంటి రోజా తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయవర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలను రేకెత్తించేలా ఆమె ట్వీట్ ఉంది. జగన్ ఆమెకు చేయిచ్చి నగరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గిరీ నుంచి పీకేయనున్నారా అన్న చర్చకు తెరలేపింది.   సాయం చేస్తే మరిచిపోతారు.. చేయకపోతే గుర్తు పెట్టుకుంటారు.. అందుకే ఈ హెల్ప్ అనేది చాలా విచిత్రమైనది అంటూ రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అదే సమయంలో నెటిజనులు రోజాను ఓ  రేంజ్ లో ట్రోల్ చేయడానికి కూడా కారణమైంది.     ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆర్కే రోజా.. అంతలోనే బేలగా సాయం చేస్తే మరిచిపోతారు.. చేయక పోతే గుర్తుంచుకుంటారు అంటే చేఃసిన ట్వీట్.. వైసీపీలో ఆమె స్థాయి తగ్గించేశారా అన్న అనుమానాలకు తెర తీసింది.   నగరి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా రోజా స్థానంలో గాలి జగదీష్ ను తీసుకురానున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ రోజాకు క్లియర్ కట్ గా చెప్పేశారనీ, ఆ కారణంగానే రోజా ఒక విధమైన నైరాశ్యంలో తాను వైసీపీకి ఎంత హెల్ప్ చేశానో అన్యాపదేశంగా గుర్తు చేస్తూ దానిని జగన్ మరచిపోయారన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవడమంటే రోజాకు పొమ్మన లేక పొగపెట్టడమేనని అంటున్నారు.   అసలు 2024 ఎన్నికలలోనే రోజాకు నగరి టికెట్ ఇచ్చే ఉద్దేశం జగన్ కు లేదన్న వార్తలు బలంగా వినిపించాయి. వరుసగా రెండు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించినప్పటికీ.. పార్టీలోనే కాకుండా నియోజకవర్గ ప్రజలలో కూడా ఆమెపై తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత గూడు కట్టుకుందని భావించిన జగన్ ఆమెకు టికెట్ నిరాకరించాలని భావించారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రోజా నోటికి జడిశారో ఏమో జగన్ అయిష్టంగానే రోజాను మళ్ళ నగరి నుంచి పోటీకి దింపారు. ఆమె ఘోరంగా పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి ఇప్పుడు ఇక రోజాను వదిలించేసుకోవడమే లక్ష్యంగా జగన్ గాలి జగదీష్ ను రంగంలోకి దింపుతున్నారు. దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడే గాలి జగదీష్. ఆయన మరో కుమారుడు గాలి భాను ప్రకాశ్ నగరి ఎమ్మెల్యే. 2024 ఎన్నికలలో గాలి భాను ప్రకాష్ తెలుగుదేశం అభ్యర్థిగా రోజాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకుని నగరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రోజాను వదిలించుకోవడంతో పాటు.. తెలుగుదేశం బలాన్నీ దెబ్బతీయవచ్చన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా ఒక విధమైన వైరాగ్యంలో హెల్ప్ ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు. 
రోజాకేమైంది.. ఆ ట్వీట్ వెనుక అర్దమేంటి? Publish Date: Mar 2, 2025 8:55AM

కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ దారుణ హత్య

కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్  దారుణ హత్యకు గురయ్యారు. హర్యానాకు చెందిన హిమానీ నర్వాల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకించండంలో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. నిశిత విమర్శలతో బీజేపీ సర్కార్ పై విరుచుకుపడుతుంటారు. అటువంటి హిమానీ నర్వాల్ ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఈ హటన రోహతక్ జిల్లాలో జరిగింది. ఆమెను హత్య చేసి ఓ సూట్ కేసులో కుక్కి సప్లా బస్టాండ్ సమీపంలో పడేశారు.  హిమానీ నర్వాల్ హత్యకు కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమె హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. హిమానీ నర్వాల్ హంతకులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్ట కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.  
కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ దారుణ హత్య Publish Date: Mar 2, 2025 7:29AM