Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దీపాలు వెలిగె... పరదాలు తొలగె... సిట్యుయేషన్ భలే సింక్ అయింది గురూ!
posted on: Jun 13, 2024 11:49AM
తెలుగు సినిమా ‘పునర్జన్మ’లో ఒక చక్కటి పాట వుంది.. ఆ పాట ‘దీపాలు వెలిగె.. పరదాలు తొలగె..’ అంటూ సాగుతుంది. అప్పట్లో ఆ పాట సూపర్ హిట్ అయింది. ఆ పాట ఇప్పుడు విన్నా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాజధాని అమరావతికి కరెక్ట్.గా సింక్ అవుతోంది. ఈ ఎలక్షన్లలో చంద్రబాబు గెలిచి, ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిలో దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి.. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి పర్యటిస్తే ఎక్కడికక్కడ పరదాలు ప్రత్యక్షమయ్యేవి.. ఇప్పుడు ఆ పరదాలు కూడా తొలగిపోయాయి.. ఇక ఈ పరదాలు వేయడం, చెట్లు కొట్టేయడం లాంటివి ఆపేయాలని చంద్రబాబు చాలా సీరియస్గా అధికారులకు చెప్పారు. అందుకే, ‘దీపాలు వెలిగే.. పరదాలు తొలగె..’ అనే పాట ఇప్పుడు ఆంధ్రులున్న సిట్యుయేషన్కి చక్కగా సింక్ అవుతుంది.

అంతేకాదు.. ఈ పాట వున్న సినిమా టైటిల్ కూడా ఇప్పుడున్న పరిస్థితికి కరెక్టుగా సరిపోతుంది.. ఆ సినిమా పేరు ‘పునర్జన్మ’. నిజమే కదా... జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పోవడంతో ఆంధ్రప్రదేశ్, అమరావతి పునర్జన్మ పొందాయి.






