Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫోన్ ట్యాపింగ్ ఒక్క తెదేపాకే పరిమితమా లేకపోతే...
posted on: Jun 10, 2015 6:13PM
(2).jpg)
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది మంత్రులు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని తెదేపా మంత్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ వారు చేస్తున్న ఆరోపణలు రుజువు చేయగలిగితే, ఇంతవరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో చెలగాటమాడుతున్న తెలంగాణా ప్రభుత్వానికి తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. కానీ తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని తెలంగాణా ఎసిబి డిజిపి ఎకె ఖాన్ తెలిపారు. కానీ ఒకవేళ తెదేపా మంత్రులు ఆరోపిస్తున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అది కేవలం తెదేపాకు మాత్రమే కాకుండా తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్, మజ్లిస్, వామ పక్షాల ఫోన్లకు వర్తింపజేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో తెరాసకు మరొక పార్టీ పోటీ ఉండకూడదనుకొంటున్నప్పుడు ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు మరి. కనుక రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ విషయంలో జాగ్రత్తపడటం మంచిది. లేకుంటే వారికి కూడా ఏదో ఒకనాడు ఇటువంటి పరిస్థితే దాపురించవచ్చును.


.jpg)
.jpg)


