Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తూర్పు గోదావరిలో తెలుగుదేశం హవా
posted on: May 12, 2014 12:11PM
.jpg)
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మొత్తం పది మునిసిపల్ స్థానాల్లో ఎనిమిది స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమలాపురంలోని 30 కౌన్సిలర్ స్థానాల్లో తెలుగుదేశం 22, వైసీపీ 7, ఇతరులు 1 స్థానాలు గెలుచుకున్నారు. తునిలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 2, టీడీపీ 17, వైకాపా 12 స్థానాలు గెలుచుకున్నాయి. సామర్లకోటలోని 30 స్థానాల్లో తెలుగుదేశం 24, వైకాపా 6 స్థానాలు గెలిచాయి. రామచంద్రాపురంలోని 17 కౌన్సిలర్ స్థానాల్లో 16 తెలుగుదేశం గెలుచుకోగా ఆరు స్థానాలు మాత్రమే వైకాపా పొందింది. 1 ఇతరులు. పిఠాపురంలోని 30 స్థానాల్లో 23 తెలుగుదేశం, 6 వైకాపా గెలిచాయి. ఒకస్థానాన్ని ఇతరులు పొందారు. మండపేటలోని 29 స్థానాల్లో 18 తెలుగుదేశం, 11 వైకాపా గెలిచాయి. పెద్దాపురంలోని 28 స్థానాల్లో 21 తెలుగుదేశం, 4 వైకాపా గెలిచాయి. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. గొల్లప్రోలులోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1 గెలుచుకోగా తెలుగుదేశం, వైకాపా చెరో తొమ్మిది స్థానాల్లో గెలిచాయి. వామపక్షాలు 1 స్థానం గెలిచాయి. ముమ్మడివరంలోని 20 స్థానాల్లో తెలుగుదేశం, వైకాపా 8 స్థానాల చొప్పున గెలిచాయి. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఏలేశ్వరంలోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 10, వైకాపా 9 స్థానాల్లో గెలిచాయి.


.jpg)
.jpg)


