మీలాగా అక్కడకు ఇక్కడకు గ్లాసులు మోయలేదు.. కొడాలి నాని దుమ్ముదులిపిన టీడీపీ నేత

మాజీ సీఎం చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ నాయకురాలు దివ్య వాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అయినా దానికి తగిన అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఎంబీఏ చదివి, ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు లోకేష్ సొంతమన్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కుమారుడిగా లోకేష్ కు కష్టపడే స్వభావం ఉందన్నారు. ‘‘అయినా మీలాంటి ఇంగిత జ్ఞానం, సంస్కారం లేని వ్యక్తులతో మాటలు పడుతున్నారు. ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేష్. అయన పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కూడా కాదు. అలాగే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కూడా కాదు. అసలు ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే...50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఆయనకు ఉంది. అయినా తనను తాను తగ్గించుకుంటూ.. అందరితో కలిసిపోతూ... పని చేసుకుంటూ లోకేష్ వెళుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. 

 

‘‘ప్రజలు నమ్మి పట్టం కట్టారు. మీమాటలు, వికృత చేష్టలతో వారు వేదనను అనుభవిస్తున్నారు. దయచేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి. అప్పు చేసి పప్పుకూడులా... ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. ఇక సీఎం కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు’’ అంటూ దివ్యవాణి తీవ్ర విమర్శలు చేశారు.