Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కరీంనగర్ సభలో టీఆర్ఎస్ రసాభస?
posted on: Apr 16, 2014 4:10PM
.jpg)
బుధవారం కరీంనగర్లో జరిగే సోనియాగాంధీ సభని సూపర్ సక్సెస్ చేసి మేడమ్ అనుగ్రహాన్ని పొందాలని టీ కాంగ్రెస్ నేతలు నానా తంటాలూ పడుతూ వుంటే, ఆ సభలో రసాభస సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ కాకుండా వేరే ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే, ఆ సభల్లో దూరిపోయి కీలక సమయంలో నినాదాలు చేసి సభలో రసాభస సృష్టించడం టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్నోసార్లు ఈ విద్యని ప్రదర్శించి టీఆర్ఎస్ పొలిటికల్ మైలేజ్ పెంచుకోగలిగింది.
ఇప్పుడు సోనియా మీటింగ్ విషయంలో కూడా ఈ ట్రిక్ ప్రదర్శించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సోనియాగాంధీ కరీంనగర్ సభలో పాల్గొనడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం వుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈ సభలో కలకలం సృష్టించడం ద్వారా ఏదో సాధించాలని టీఆర్ఎస్ ఆశించవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.


.jpg)
.jpg)


