Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇక అవి కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమే
posted on: Dec 8, 2014 11:29AM
.jpg)
ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలను, ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏడు మండలాల బదిలీ ప్రక్రియ ఈ మధ్యనే పూర్తయిందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణరావు తెలిపారు. ఆ మండలాలతో బాటు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డారు. కనుక వారికి ఈ నెల నుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే జీతాలు చెల్లించబోతున్నట్లు ఆయన తెలిపారు. పరిపాలనా సౌలభ్యం మరియు భౌగోళిక స్థితిని బట్టి ఆ ఏడు మండలాలో కొన్నిటిని తూర్పు గోదావరి మరి కొన్నిటిని పశ్చిమ గోదావరి జిల్లాలలో విలీనం చేసారు. కనుక రాష్ట్ర పోలీస్ పరిధి కూడా ఆ మేరకు పెంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
అదేవిధంగా భద్రాచలం సమీపంలో ఆంద్ర సరిహద్దులో గల ఏటిపాక కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రెండు జిల్లాలలో విస్తరించిన ఆ ఏడు మండలాలు దాని క్రిందకు వస్తాయి. ఈ పని పూర్తయిన తరువాత నుండి ఆ ఏడు మండలాలలో నివసిస్తున్న ఆదివాసీల పునరావాసానికి అవసరమయిన చర్యలు చెప్పట్టడం మొదలయ్యే అవకాశం ఉంది. కొత్తగా రాష్ట్రంలో విలీనమయిన ఈ మండలాలకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిని విస్తరించేందుకు అవసరమయిన మార్గదర్శకాలు, ఏర్పాటు మరొక వారం రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు.



.jpg)


