Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ హస్తిన పర్యటన.. కారణమేంటంటే?
posted on: Apr 14, 2026 12:47PM

నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గొంతును బలంగా వినిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (ఏప్రిల్ 15) దేశ రాజధాని ఢిల్లీ వెడుతున్నారు. ఈ పర్యటన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం హస్తిన వేదికగా గళమెత్తడినికే అని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
జనాభాకు 50 శాతం, జీఎస్డీపీకి 50 శాతం ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని బలంగా డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంపైనే ఇండియా కూటమి నేతలతో చర్చించనున్నారు. వీలైతే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అంశంపై కూడా ఈ పర్యటనలో ఇండియా కూటమి నేతలతో రేవంత్ చర్చిస్తారు. ఇక పనిలో పనిగా కేంద్ర మంత్రులను కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల గురించి కూడా చర్చించే అవకాశా లున్నాయి.



.webp)


