Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ రెడ్డి కేసు చివరికి దేనికి దారి తీస్తుందో?
posted on: Jun 8, 2015 6:26AM
.jpg)
రేవంత్ రెడ్డి వ్యవహారంలో అవినీతిని బయటపెట్టాలనే తపన కంటే తెదేపాను, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని రాజకకీయమే ఎక్కువగా కనిపిస్తోందని ఇప్పుడు సర్వత్రా మాటలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆడియో, వీడియో టేపులను మీడియాకు బహిర్గతం చేయడం, తెలంగాణా హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణల రికార్డ్ తమ వద్ద ఉందని, దానిని సరయిన సమయంలో బయటపెడతామని చెప్పడం, ఆ తరువాత మళ్ళీ చిన్నబాబయినా, పెద్దబాబయినా....ఏబాబునీ విడిచిపెట్టబోమని చెప్పడం, ముందు చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు నామినేటడ్ యంయల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లు చెప్పబడుతున్న ఫోన్ సంభాషణలను మీడియాకు విడుదల చేయడం అన్నీ కూడా రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నట్లుగానే కనబడుతున్నాయని రాజకీయ వర్గాలలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ అత్యుత్సాహంలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు స్వయంగా బయటపెట్టుకొన్నట్లయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గవర్నర్ నరసింహన్ని కలిసినప్పుడు పిర్యాదు చేసినట్లు సమాచారం. అదే విధంగా ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేసేందుకు ఆయన స్వయంగా రేపు డిల్లీ వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా రెండు ప్రభుత్వాలు చాలా విషయాలలో గొడవలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ గొడవ ఏ విపరీత పరిణామాలకు దారి తీస్తుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు.


.jpg)
.jpg)


