బాత్రూమ్లు కడగడానికి వాలంటీర్లను కేటాయిస్తారా? జగన్కు ఏకిపారేసిన రఘురామ
posted on Sep 27, 2021 4:11PM
రఘురామ మాటలు తూటాల్లా వస్తుంటాయి. నిత్యం ఏపీ సర్కారును, సీఎం జగన్ను విమర్శలతో తూట్లు పొడుస్తుంటారు. ఘాటైన వ్యాఖ్యలతో ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు నిలదీస్తుంటారు. తాజాగా సినీ ఇండస్ట్రీ రచ్చపైనా ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ వార్లో పీకేకు ఫుల్ సపోర్ట్గా నిలిచారు. ఇక మూవీ టికెట్స్ ఆన్లైన్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని పదునైన విమర్శలతో ఏకిపారేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
‘‘సినిమా వ్యాపారం అనేది చాలా చిన్న వ్యాపారం. అలాంటి దానిపై ప్రభుత్వం అంత శ్రద్ధ చూపించడం అవసరమా? రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకోవడం లేదు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ వాళ్లే అడిగినా కూడా ప్రభుత్వానికి అవసరమా? వాళ్లు ఎన్నైనా అడుగుతారు. సినిమా హాళ్ల బాత్రూమ్లు క్లీన్ చేయడానికి మీరు వాలంటీర్లను కేటాయించండి అని కూడా అడుగుతారు. వాళ్లకు ఇచ్చే రూ. 5వేలు మేమే ఇస్తాం. అంత తక్కువకు మాకు ఎవరూ రావడం లేదు. మీరు వాలంటీర్ల పేర్లతో మాకు కేటాయించండి అని అడిగితే ఇస్తారా? అడగడానికి వాళ్లెవరు? ఓకే చెప్పడానికి వీళ్లెవరు? ఇది చాలా తప్పు’’ అంటూ రఘురామ విరుచుకుపడ్డారు.
ఇక, పవన్ కల్యాణ్కు సైతం రఘురామ సపోర్ట్ చేశారు. ‘‘పవన్ చెప్పిన విషయాన్ని నేను సమర్థిస్తా. పవన్ కల్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు. తన మీద కోపాన్ని ఇండస్ట్రీపై చూపిస్తున్నారనే ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది.’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.