పవన్ అండ్ ప్రకాష్... ట్వీట్ల యుద్ధం కంటిన్యూ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మనకు కావలసింది ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమా, లేక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమా అంటూ ట్వీట్ చేశారు. లడ్డూ వివాదంలో ప్రకాశ్ రాజ్ స్పందనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. లడ్డూ వివాదంపై తమిళ నటుడు కార్తి చేసిన వ్యాఖ్యపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేయడం... కార్తి సారీ చెప్పడంపై కూడా పవన్ మొత్తానికి అడిగి సారీ చెప్పించుకున్నారుగా అంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద ప్రకాశ్ రాజ్ ట్వీట్లు జనసేనానికి, జనసైనికులకు అసహనం తెప్పిస్తున్నాయనడంలో సందేహం లేదు.