Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా....!
posted on: May 3, 2018 4:14PM

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మోడీపై విమర్శలు ఆయన గుప్పించారు. ఈరోజు ‘ప్రజాస్వామ్య రక్షణ కోసం’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...‘ప్రధాని మోదీ గారూ..! 2019 తర్వాత దేశంలో మీకు అంతగా పనేం ఉండదు. కర్ణాటక వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారు. ఏమిటండీ.. ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం..!’ అని...రాష్ట్రంలో నాలుగైదు సభల్లో మోదీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. ఏమిటండీ ఈ భాష కాయగూరలు అమ్మినట్లు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాకేం భయంలేదు... ఈ భాజపావాళ్లు నన్నేమీ చేయలేరు. నేను ఏ పార్టీ వ్యక్తిని కాను’..భాజపా నాయకులు తమది ప్రభంజనమని చెబుతూ.. సునామీ, ప్రళయాలతో పోల్చుకుంటున్నారు. సునామీలు దేశానికేమైనా మంచివా? అని ప్రశ్నించారు. రాహుల్గాంధీ ప్రసంగంతో పోటీ పడుతున్న మోదీని ప్రకాష్ తీవ్రంగా విమర్శించారు. ‘రాహుల్ వయసెంత..మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా’ అని అన్నారు. ‘ఈ నెల 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలే చెబుతాయి. ఇక్కడ మీ ప్రతాపం ఎంతుందో? ఇక్కడి నుంచే భాజపా పతనం ఆరంభమవుతుంది’ అని జోస్యం చెప్పారు.


.jpg)
.jpg)


