ఎక్స్ క్లూజివ్‌: స్పిరిట్ షురూ అయ్యేది అప్పుడే!

ప్ర‌భాస్ సినిమాల‌కు సంబంధించి రోజుకో న్యూస్ ఫ్యాన్స్ ని తిక‌మ‌క‌పెట్టేస్తోంది. రీసెంట్‌గా క‌న్న‌ప్ప సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తార‌నే వార్త ఇంట‌ర్నెట్‌ని షేక్ చేసింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించే సినిమా వార్త వేగంగా వైర‌ల్ అవుతోంది. క‌బీర్ సింగ్‌లాంటి హిస్టారిక‌ల్ స‌క్సెస్‌ని ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించ‌నున్న సినిమా స్పిరిట్‌. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగా త‌న యానిమ‌ల్ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్‌,  మురాద్ ఖేతాని నిర్మిస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్‌, ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది యానిమ‌ల్‌. 

ఈ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప‌నుల్లో త‌ల‌మున‌క‌ల‌వుతారు. వ‌చ్చే ఏడాది జూన్ నుంచి స్పిరిట్ షూటింగ్‌లో పాల్గొంటార‌ట ప్ర‌భాస్‌. యానిమ‌ల్ రిలీజ్ అయ్య‌క కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకుంటారు సందీప్ రెడ్డి వంగా. వ‌చ్చే ఏడాది స్టార్టింగ్ నుంచి స్పిరిట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెడ‌తారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. ఆల్రెడీ బేసిక్ రైటింగ్ ప‌నులు పూర్త‌య్యాయి. ఇంకా పూర్తి స్థాయి ప‌నులు జ‌ర‌గాల్సి ఉంది. ఈ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. 2025లో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని అన్నారు భూష‌ణ్‌కుమార్‌. స్పిరిట్ గురించి భూష‌ణ్ కుమార్ మాట్లాడుతూ ``బిగ్గెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిస్తాం. ఇందులో ప్ర‌భాస్ కాప్ రోల్ చేస్తున్నారు. టీసీరీస్ అద్భుతంగా డిజైన్ చేస్తోంది ఈ మూవీని`` అని అన్నారు.