Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పొన్నాలపై నైతిక విజయం: జానా ఆత్మానందం!
posted on: Jun 4, 2014 2:11PM
.jpg)
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అడ్డగోలుగా తెలంగాణ ఇచ్చేశాం కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీ కాంగ్రెస్ నాయకులు కలలు కన్నారు. తీరా ఎన్నికలలో తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ని చావగొట్టి చెవులు మూశారు. టీఆర్ఎస్కి అధికారం కట్టబెట్టారు. టీ కాంగ్రెస్లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కన్న మహామహులైన నాయకులందరూ ఓడిపోయారు. దాంతో టీ కాంగ్రెస్ నాయకులు ఎవరిలోనూ కత్తివాటుకు నెత్తురు చుక్క కూడా లేకుండా పోయింది. అయితే తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలని కలలు కని, ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో విభేదాలు పెంచుకున్న పొన్నాల మాత్రం ప్రస్తుతం చాలా ఆత్మానందంలో వున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయిందన్న బాధ ఆయనలో వున్నప్పటికీ, తాను పొన్నాల లక్ష్మయ్య మీద సాధించిన నైతిక విజయం ఆయనకి ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలంగాణ సీఎం నువ్వా నేనా అని జానా, పొన్నాల ఇద్దరూ విభేదించుకున్నారు. చివరికి ఇద్దరూ సీఎం కాకుండా పోయారు. కాకపోతే చివరికి ఈ ఇద్దర్లో జానాదే పైచేయి అయింది. ఎన్నికలలో పొన్నాల ఓడిపోతే, జానా మాత్రం గెలిచారు. పొన్నాల గాంధీ భవన్లో కూర్చుని ఈగలు తోలుకునే పరిస్థితిలో వుంటే, జానా మాత్రం తెలంగాణ కాంగ్రెస్కి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎంపికయ్యారు. ఈ రకంగా పొన్నాల మీద నైతిక విజయాన్ని సాధించిన జానా మనసులో పులకరించిపోతున్నట్టు తెలుస్తోంది.


.jpg)
.jpg)


