Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుకి ఎప్పుడో చెప్పా.. పట్టించుకోలేదు..
posted on: Mar 19, 2018 4:17PM
.jpg)
ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను... టీడీపీ నేతలు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పవన్ వెనుక బీజేపీ ఉందని కూడా వాదిస్తున్నారు. ఇదిలా జరుగుతుండగా మరోసారి పవన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఓ జాతియ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ మరోసారి ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మండిపడ్డారు. ప్రభుత్వంలోని అవినీతిపై చంద్రబాబుకు తెలుసు.. 40 మంద ఎమ్మేల్యేలు, కొంత మంది టీడీపీ నేతలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై నాకు చెప్పారు.. నేను కూడా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు చాలా సార్లు చెప్పా.. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి.. లోకేశ్ కు ఉన్న లింకులపై న్యాయ విచారణ చేపట్టాలి అని అన్నారు. మోడీతో నాకు సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవమే.. బీజేపీ, టీడీపీ మధ్య జరుగుతున్న గొడవలో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు.. బీజేపీపై ప్రజల్లో నమ్మకం లేదు.. ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీల నుండి వస్తున్న డిమాండ్.. దీనిపై ప్రజల్లో పట్టింపు లేదు.. హోదానా, ప్యాకేజీనా పేరు ఏదైనా రాష్ట్రానికి ఆర్ధిక సాయం కావాలి అని అన్నారు. ఇంక థర్డ్ ప్రంట్ పై ఇప్పుడేమి చెప్పలేను అంటూ చంద్రబాబు, కేసీఆర్ పాలనపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. చంద్రబాబుకి 2.5మార్కులు..కేసీఆర్ కు 6 మార్కులు వేశారు. మరి ఇప్పటికే పవన్ మీద గుర్రుగా ఉన్న టీడీపీ నేతలకు మరోసారి పవన్ మంటపుట్టించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో.. ముఖ్యంగా చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.






