టీడీపీలో చేరిన నూతక్కి వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు

posted on: Jun 17, 2026 8:03PM

 

మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన మోరంపూడి గోపాలకృష్ణ, నూతక్కి జనార్థన రావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, జూకపల్లి మధుబాబు, కే.కోటేశ్వరరావు, జిలుగు రాజు, బి.ఇస్సాకు, నూతక్కి వెంకట రావు, శ్రీనివాసరావు, నూతక్కి కోటేశ్వరరావు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో రెండేళ్లలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని, ప్రతిపక్షం దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, మంగళగిరి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, నూతక్కి గ్రామ పార్టీ అధ్యక్షుడు వల్లూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...