Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజీవ్ గాంధీకి మోడీ నివాళులు!
posted on: May 21, 2015 5:20PM
.jpg)
ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఒకవేళ దేశంలో కానీ రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మంత్రులందరూ, మంత్రి పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నవారు అందరూ ఆయనకు ఘన నివాళులు అర్పించే మిషతో చాలా హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, మరి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు డిల్లీలో ఆయన సమాధి వీర్ భూమి వద్ద నివాళులు అర్పించారు. బహుశః దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఏవో కార్యక్రమాలు చేసే ఉండవచ్చును. కానీ ఇతర రాజకీయ పార్టీలు మాత్రం దానితో తమకు ఎటువంటి సంబంధమూ లేనట్లు, రాజీవ్ గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగానే చూసారు తప్ప దేశానికి మాజీ ప్రధానమంత్రిగా సేవలు అందించిన వ్యక్తిగా చూడలేదు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆయనకు ట్వీటర్ ద్వారా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఆయన 1991 సం.లో తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు శ్రీపెరుంబుదూర్ లోఎల్టీటీఈ ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో మరణించారు.


(2).png)
.jpg)


