Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ వ్యాఖ్యలతో శత్రు శిబిరంలో వణుకు
posted on: Jul 1, 2015 10:49PM

తండ్రి చంద్రబాబు నాయుడిలోని రాజకీయ పరిణతి నారా లోకేష్ ప్రతి అడుగులోనూ కనిపిస్తూ వుంటుంది. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ చంద్రబాబు మాటలాగానే ఎంతో లోతు వినిపిస్తూ వుంటుంది. తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ‘శత్రు శిబిరం’లో వణుకునుపెంచాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పేరు చెబితేనే ఉలిక్కిపడుతూ వణికిపోతున్న ‘శత్రు శిబిరం’ నాయకులు తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు విని కెవ్వుమంటున్నారు. కుట్రపూరితంగా పన్ని పథకాలతో తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించిన ఆ శత్రువులు ఇప్పుడు తాము పన్నిన కుట్రల బురదలో తామే చిక్కుకుని విలవిలలాడుతున్నారు. చంద్రబాబును బద్నాం చేసే సంగతి, తెలుగుదేశం పార్టీని వేధించే సంగతి తర్వాత.. ముందు తాము వున్న బురదలోంచి, ఊబిలోంచి ఎలా బయటపడాలా దేవుడా అని గుర్తొచ్చిన దేవుళ్ళందర్నీ వేడుకుంటున్నారు. తాజాగా నారా లోకేష్ కార్యకర్తలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ‘శత్రు శిబిరం’ మీద బలమైన ప్రభావాన్ని చూపించాయి. తమ నాయకుడు చంద్రబాబు నాయుడికి శత్రు శిబిరం నుంచి నోటీసులు వస్తే అది చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టుగా తాము భావిస్తామని, నోటీసులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. ఆ మాటల్లోని ఆత్మవిశ్వాసమే చెబుతోంది... శత్రు శిబిరంలో వున్నవారి పిలకలు ఏపీ ప్రభుత్వం చేతిలో వున్నాయని. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు నోటీసులకు పంపే దుస్సాహసం చేసే దమ్ము సదరు శత్రువులకు వుండదు. నారా లోకేష్ చేసిన ఈ కామెంట్లు తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. పనిలో పనిగా శత్రు శిబిరంలో వణుకును పెంచాయి.






