Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు కోడలా మజాకా... రిపోర్టర్ కు సూపర్ కౌంటర్...
posted on: Nov 29, 2017 4:15PM
.jpg)
నారా వారి కోడలు నారా బ్రహ్మణి సామర్యం ఏంటో మరోసారి చూపించింది. ఓ రిపోర్టర్ కు దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చి నోరు మూయించింది బ్రహ్మణి. హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నసంగతి తెలిసిందే కదా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు.. ఇవాంక ట్రంప్ ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చారు. ఇక ఈ సదస్సులో నారా చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. ఇక మీటింగ్ అయిపోయిన అనంతరం బయటకు వచ్చిన ఆమెను.. ఓరిపోర్టర్ హైదరాబాద్ లో ఈ సదస్సు జరగడం అసూయ కలిగిస్తోందా అని ఓ తింగరి ప్రశ్న అడిగాడు. ఇక దీనికి బ్రహ్మణి ఆవేశంతో ఊగిపోకుండా... చాలా నీట్ గా.. రిపోర్టర్ నోరు మాయించేలా సమాధానం చెప్పింది. ఇంతకీ బ్రహ్మణి ఏం సమాధానం చెప్పిందనుకుంటున్నారా...“ సదస్సు ఎక్కడ జరుగుతుందన్నది ముఖ్యం కాదు . దాని నుంచి ఏమి నేర్చుకున్నాం , ఎంత స్ఫూర్తి పొందాం అన్నదే ముఖ్యం. అమరావతిలో కిందటేడాది అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ జరిగింది. అలాగే ఇది. అయినా మీలాగా మేము ఆలోచించలేం” అంటూ బ్రాహ్మణి సమాధానం చెప్పిందట. ఇక బ్రహ్మణి ఇచ్చిన సమాధానంతో ఆ ప్రశ్న వేసిన రిపోర్టర్ కి దిమ్మ తిరిగిపోయిందట. దీంతో బ్రహ్మణి చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందరికీ తెగ నచ్చేసి సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఏం మాట్లాడితే.. ఏం తలనొప్పో అని కంగారు పడుతుంటారు. కానీ బ్రహ్మణి మాత్రం చాలా సింపుల్ గా ఆన్సర్ చేసి తన సామర్ద్యం ఏంటో చూపించింది. మరి ఎంతైనా చంద్రబాబు కోడలు కదా.. ఆ మాత్రం సమాధానం చేయకపోతే ఎలా...






