Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ క్రికెట్ దౌత్యం.. జగన్ కు అంత ఉలుకెందుకంటే?
posted on: Mar 9, 2026 10:21AM

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ను చూసేందుకు స్టేడియంకు వెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఇంట్లో కూర్చుని చూసే మ్యాచ్ కి అంత ఖర్చు పెట్టి.. వెళ్లి చూడ్డం అవసరమా? విమర్శలు చేశారు ఆ సందర్భంగానే మంత్రి లోకేష్.. ఫైనల్స్ కి కూడా ఇలాగే వెళ్తా.. వస్తానంటే మిమ్మల్నీ తీసుకెడతా జగన్ అంటూ రిటార్డ్ ఇచ్చారు. అది పక్కన పెడితే.. క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వెళ్లిన సందర్భంగా నారా లోకేష్ అక్కడ మ్యాచ్ చూడడానికి వచ్చిన కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖు, బిజినెస్ దిగ్గజాలతో కూడా భేటీ అవుతున్నారు. వారితో పలు అంశాలపై చర్చిస్తున్నారు.
ఇప్పటికే ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో లోకేష్ కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆయన చొరవ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మొత్తంగా నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ల వీక్షణకు స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు.. రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేందుకు గల అవకాశాలను కూడా జల్లెడపడుతున్నారు. ఇదే జగన్ దుగ్ధకు కారణమని పరిశీలకులు అంటున్నారు.
ఏది ఏమైనా ఇరవై నాలుగు గంటలూ గిరి గీసుకుని ఒకే చట్రంలో ఇరుక్కు పోకుండా.. బావిలో కప్పలా మిగిలిపోకుండా అప్పుడప్పుడూ ఇలాంటి ఈవెంట్స్ కి హాజరు కావడం ఇటు మానసికోల్లాసం. అటు రాజకీయ ప్రయోజనం రెండు కలసి వస్తాయనీ, లోకేష్ అదే చేస్తున్నారనీ అంటున్నారు విశ్లేషకులు.
క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చే పారిశ్రామిక వేత్తలతో సంభాషించే అవకాశాలను ఆ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఒడిసిపడుతున్నారంటున్నారు. తద్వారా తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే ఛాన్స్ ఏర్పడుతోందంటున్నారు. ఇప్పటికే అమరావతిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించి ఉన్నారు. అందులో భాగంగా ఏమేం చేయాలో తెలియాలంటే ఇలాంటి మ్యాచ్ లకు హాజరు కావాలి. ఆ సమయంలో ఎదురయ్యే పలువురు క్రీడాకారులతో కలసి ముచ్చటించవచ్చు. ఐడియాలు షేర్ చేసుకోవచ్చు. తాజాగా ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన టి20 వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు నారా లోకేష్.. ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం ఎలా నిర్మించారో ఒక పరిశీలన చేశారు.
అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. అలాగే క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ తదితరులతో సంభాషించారు. ఇవన్నీ కచ్చితంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఎంతగానో దోహదం చేస్తాయని అంటున్నారు. అందుకే జగన్ వంటి నాయకుల విమర్శలను పట్టించుకోకుండా.. న్యూజెన్ లీడర్ గా లోకేష్ ముందుకు సాగుతున్నారు. అలా సాగడం ద్వారా జగన్ ది అవుట్ డేటెడ్ క్రిటిసిజమ్ అన్న సంకేతాలు ఇస్తున్నారు.
భారత్ లో క్రికెట్ అంటే ఒక మతం, ఒక ఎమోషన్. కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకువచ్చే ఒక ఈవెంట్. అలాంటిది.. టి20 వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్ లో ఫైనల్ ఆడుతున్న టీమ్ ఇండియాను ఎంకరేజ్ చేయడానికి ప్రత్యక్షంగా మ్యాచ్ చూడడానికీ స్టేడియంకు వెళ్లడం ద్వారా లోకేష్ తనను తాను కోట్లాది మందితో కనెక్ట్ చేసుకుంటున్నారనడంలో సందేహం లేదు. ఇక రాష్ట్ర ఐటీ మంత్రిగా అంతర్జాతీయ ప్రతినిథులు ఉన్న చోట ఉనికి చాటుకోవడం కూడా ఏపీ బ్రాండ్ వాల్యూ లోకేష్ పెంచుతున్నారని భావించాల్సి ఉంటుంది. ఇదే జగన్ ను కలవరపెడుతున్నది. లోకేష్ క్రికెట్ దౌత్యం రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుండటం.. తనకు రాజకీయంగా నష్టం చేస్తుందన్న భయంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.



.webp)


