వైసీపీకి వరుసగా షాకులే షాకులు!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి వలసలు వెల్లువలా సాగుతున్నాయి.  రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. ఇలా వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారి తమ దారి తాము చూసుకున్నారు. ఇక ఇప్పడు తాజాగా అంటే ఈ రోజు వైసీపీ నుంచి ముగ్గురు కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ముగ్గురూ ఇప్పటికే వైసీపీకి గుడ్ బై  చెప్పేశారు. ఈ రోజు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన కండువా కప్పుకోనున్నారు.