ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడా.. ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌నం.. ఏం సెప్తిరి ఏం సెప్తిరి..

ల‌క్ష్మీపార్వ‌తి కీలక ర‌హ‌స్యం బ‌య‌ట‌పెట్టారు. 26 ఏళ్లు త‌న మ‌న‌సులోనే దాచుకున్న ఆ టాప్ సీక్రెట్‌ను ఇప్పుడు రివీల్ చేశారు. ఎన్టీఆర్ 26వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆ సంచ‌ల‌న విష‌యం వెల్లడించారు.

నందమూరి తారకరామారావు చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చెప్పారు. ‘‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడా. జీవిత రాజశేఖర్‌లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది.’’ అంటూ లక్ష్మీ పార్వతి సంచలన విషయం చెప్పారు. 

ఇది విన్న‌వారంతా.. అబ్బా.. ఛా.. అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆత్మ‌ల‌తో మాట్లాడే అల‌వాటు మీకు కూడా ఉందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. గ‌తంలో మీ వైసీపీ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కూడా ఇలానే కామెడీ చేశార‌ని గుర్తు చేస్తున్నారు. తాను అర్థ‌రాత్రి వైఎస్సార్‌తో మాట్లాడుతుంటాన‌ని.. ఆయ‌న త‌న‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటార‌ని.. జ‌గ‌న్‌రెడ్డి త‌న స‌న్నిహితుల‌తో చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కేవ‌లం వైఎస్ ఆత్మ‌తోనే కాదు.. జీస‌స్‌తోనూ డిస్క‌ష‌న్ చేస్తార‌ట జ‌గ‌నన్న‌. ఈ విష‌యాలు ఆయ‌నే చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న్నెవ‌రికైనా చూపించండ్రా.. అంటూ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెడీ ట్రాక్ న‌డిచింది. 

అప్పుడు జ‌గ‌న్‌.. ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఇద్ద‌రూ ఇద్ద‌రే. అయితే, ల‌క్ష్మీపార్వ‌తి.. ఎన్టీఆర్ ఆత్మ‌తో మాట్లాడింది ఇప్పుడు కాదు. 26 క్రితం. ఎన్టీఆర్ మ‌ర‌ణించిన కొత్త‌లోన‌ట‌. అందుకు, జీవితా రాజ‌శేఖ‌ర్‌లే సాక్షం అంటున్నారు. ఇప్పుడు జీవిత‌-రాజ‌శేఖ‌ర్ దంప‌తులు బ‌య‌టికొచ్చి.. అస‌లు ఆనాడు ఏం జ‌రిగిందో.. ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ ఆత్మ‌తో మాట్లాడారో లేదో.. చెబితే గానీ జ‌నం న‌మ్మేలా లేరంటున్నారు.