సలసల కాగుతున్న కల్తీ నెయ్యి!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించిన అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇటు కూటమి, అటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వెంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని, ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28న (శనివారం) పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది.