Top Stories

కృష్ణారెడ్డి ఐపీఎస్.. కృషి ఉంటే యువకులు ఐపీఎస్ లు అవుతారు!

ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి.. ఐపీఎస్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు  ఉదయ కృష్ణారెడ్డి. అందుకే, స్వయం కృషికి సజీవ రూపంగా నిలిచే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయ కృష్ణారెడ్డిని అభినందించారు. కన్న కలలను సాకారం చేసుకున్న కృష్ణా రెడ్డి.. కలలు కనండి , కన్న కలలను సాకారం చేసుకోండి, అన్న మరో మహనీయుడు, ప్రాతః స్మరనీయుడు, మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాంను కూడా  గుర్తుకు తెచ్చారు. ఆ విధంగానూ కృష్ణా రెడ్డి  అభినందనీయుడు.  అవును. చంద్రబాబు నాయుడు తమ అభినందన సందేంలో అన్నట్లుగా  ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితాని ప్రారంభించి  ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన కృష్ణా రెడ్డి జీవితం యువతకు ఒక ఆదర్శం. నిరంతర పరిశ్రమతో, కృషి, పట్టుదలను తోడు చేసుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కలైనా  సాకారం అవుతుందని.. ఎంతటి అవరోధాలనైనా అతిక్రమించ వచ్చునన్న సత్యాన్ని కృష్ణా రెడ్డి మరోమారు నిరూపించారు. అవును..  ముఖ్యమంత్రి అనంట్లుగా ఓటమిని అంగీకరించని వారిదే భవిష్యత్ అని మరో నిరూపించిన, కృష్ణా రెడ్డి  ఐపీఎస్ నిజంగా అభినందనీయుడు. ఎవరీ కృష్ణా రెడ్డి, ఏమా కథ? అంటే..  ప్రకాశం జిల్లాలోని ఉల్లపాలెం గ్రామానికి చెందిన ఎం. ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 350 ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో స్థానం సంపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అభినందనలు అందుకున్నారు. కలలు కనండి ...కన్న కలలను సాకారం చేసుకోండి  అన్న మాజీ రాష్ట్రపతి ఎపీజే అబ్దుల్ కలాం  సందేశానికి  సజీవ రూపంగా నిలిచిన  ఉదయ కృష్ణారెడ్డి 2013లో,ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. గుడ్లూరు, రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అదే సమయంలో, ఉన్నతాధికారి నుంచి ఎదురైన అవమానాలు అతనిలో ఐపీఎస్  కావాలనే ఆకాంక్షను రగిల్చాయి. ఆ అధికారి చేసిన అవమానమే అతనిలో అశయాన్ని రగిల్చింది.  పేదరికంలో పుట్టి..  చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయకృష్ణారెడ్డిని అతని అమ్మమ్మ రమణమ్మ పెంచింది. కూరగాయలు అమ్ముకుని పొట్ట పోసుకునే  రమణమ్మ, మనవడిని పెంచి పెద్ద చేసింది. అలాగే, అతని మామ కోటి రెడ్డి చేయూత నిచ్చారు. చేయి పట్టి నడిపించారు. అటు అమ్మమ్మ రమణమ్మ,ఇటు మేన మామ కోటి రెడ్డి ఇచ్చిన చేయూతతో, కృష్ణారెడ్డి  2013లో ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఉన్నతాధికారి చేసిన అవమానాలకు సమాధానంగా ఐఏఎస్ కావాలని సంకల్పం చెప్పుకున్న, కృష్ణారెడ్డి, 2018 లో సివిల్ సర్వీసెస్ పూర్తి సమయం కోసం కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పట్టు వదలని విక్రమార్కునిలా  మరో ప్రయత్నం చేశారు. ఈసారి 780 వ ర్యాంక్ వచ్చింది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ లో ఉద్యోగం వచ్చింది. అయినా, ఐపీస్  కావాలనే, ఆశయాన్ని చంపుకోలేదు. కల అంటే నిద్రలో వచ్చేది కాదు... నిద్ర పోనివ్వకుండా చేసేది కల   అన్న   కలాం స్పూర్తితో  రైల్వే సర్వీస్  శిక్షణ సమయంలో మరోమారు సివిల్స్ రాశారు. 350వ ర్యాంక్ సాధించారు. ఐపీఎస్ కల సాకారం చేసుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.  ఇప్పుడు ఉదయ కృష్ణా రెడ్డి. ఐపీఎస్.. భారతీయ యువత లో అపారమైన సామర్ధ్యం ఉందని, ఆత్మ స్థైర్యంతో ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగితే విజయం తధ్యమని విశ్వాసం వ్యక్త పరిస్తున్నారు. అమ్మమమ రమణమ్మ, మామయ్య కోటి రెడ్డి తన జీవితాన్ని తీర్చి దిద్దారని అన్నారు.అలాగే, తన ప్రయాణంలో సహకరించిన  మెంటర్స్,కు కృతజ్ఞతలు తెలిపారు.  అన్నివిధాల తండ్రిలా ఆడుకున్నఅదనపు డీజీ మహేష్ భగవత్‌కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణారెడ్డి ఐపీఎస్..  కృషి ఉంటే యువకులు  ఐపీఎస్ లు అవుతారు! Publish Date: Apr 30, 2025 6:28AM

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం.. గోడకూలి ఎనిమిది మంది మృతి

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.  సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూ లైన్ వద్ద  ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం (ఏప్రిల్ 29) అర్థరాత్రి దాటిన తరువాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. ఆ కారణంగానే గోడ కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. గోడ కూలిన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎష్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ సంఘటనా స్థలం వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం.. గోడకూలి ఎనిమిది మంది మృతి Publish Date: Apr 30, 2025 6:10AM

విజయసాయిరెడ్డి ఇరికిస్తున్నారా?.. ఇరుక్కుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న నేత.. వైసీపీ మాజీ ఎంపీ వై.విజయసాయిరెడ్డి.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా అందరికీ సుపరిచితుడైన ఆ ఆడిటర్ .. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని.. ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడేళ్లకు పైగా ఉండగానే ఆయన పదవికి, వైసీపీకి రాజీనామా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.  ఆ క్రమంలో కాకినాడ సీపోర్టు కేసులో కూడా ఏ2 గానే ఫైల్ అయ్యారు. దీంతో  రాజకీయాల్లో ఉన్నా లేకున్నాన్నా తనకు ఏ2 మాత్రం కామన్‌గా మారిపోయిందనుకున్నారో? లేక పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేద్దామనుకుంటున్నారో స్పష్టత లేదు కానీ కాకినాడు పోర్టు కేసు విచారణ మొదలైన నాటి నుంచి పొలిటికల్ అటెన్షన్‌ని మాత్రం తన వైపుకు తిప్పుకుంటున్నారు సాయిరెడ్డి.  గతంలో వైసీపీలో అన్నీ తానై చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా అటు మీడియాతో పాటు పొలిటికల్‌గా అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకోవడనికి తెగ తాపత్రయ పడిపోతున్నారు. గత నెలలో కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు వెళ్లిన సాయిరెడ్డి, విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కాంపై హాట్ కామెంట్లు చేశారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవరికీ తెలియని రాజ్ కేసిరెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు.  అక్కడి నుంచి రకరకాల ట్విస్ట్ ల మధ్య కేసు విచారణ షురూ అయ్యింది.. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అవ్వడంతో తేనె తుట్టె కదులుతోంది. అంతేకాక కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని చేసిందంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే చేశారని విజయసాయి చెప్పుకొచ్చారు. పోర్టు వాటాల స్వాధీనానికి సంబంధించి మొత్తం చేసింది విక్రాంత్‌రెడ్డే అని బాంబు పేల్చారు. ఆ తర్వాత టాపిక్ ను కాకినాడ పోర్టు అంశం నుంచి లిక్కర్ స్కాం వైపు డైవర్ట్ చేశారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందు ఫోకస్ చేసింది లిక్కర్ స్కాంపైనే.. అయితే దాన్ని ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్దం కాక సర్కారు సతమతమవుతున్న సమయంలో అవసరం లేకపోయినా విజయసాయరెడ్డి దారి చూపించారంటున్నారు.  ఏపీ లిక్కర్ స్కాంలో సూత్రధారి.. పాత్రధారి అంటూ జగన్ సన్నిహితుడైన కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరును హైలెట్ చేశారు. భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో విజయసాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణ కి హాజరయ్యారు. ఈ కేసులో అంతవరకు నిందితుడిగా భావించిన సాయిరెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగింది.  ఈ నెల 18న లిక్కర్ స్కాంపై విచారణకు హాజరైన సాయిరెడ్డి.. యధావిధిగా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు.. మద్యం స్కాం మొత్తాన్ని కేసిరెడ్డి రాజ్ రెడ్డి నడిపించారని మరోసారి కుండ బద్ధలు కొట్టారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన మీటింగ్స్, కేసిరెడ్డి వ్యవహార శైలిపై సంచలన  విషయాలు వెల్లడించారు.  అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఉన్నారన్న సాయిరెడ్డి ఆ ఇద్దరు వ్యాపారం చేసుకుంటామంటే అరబిందో కంపెనీ నుంచి తాను 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించానని తెలిపారు. ఇందులో అదాన్ డిస్టలరీస్ కి 60 కోట్లు, డికాక్ సంస్థకు 40 కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి ద్వారా సమకూర్చానన్నారు. అదాన్ డిస్టలరీస్ కి ఇచ్చిన 60 కోట్లు వడ్డీతో కలిసి తిరిగి ఇచ్చేశారని.. డికాక్ తీసుకున్న 40 కోట్లలో అసలు మాత్రమే రిటర్న్ వచ్చిందని.. దీనిమీద ఇంకా వివాదం కొనసాగుతోందన్నారు. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే వారికి వ్యాపారం చేసుకోవటానికి 100 కోట్లు అప్పు ఇప్పించానని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. అయితే సాక్షిగా విచారణకు పిలిచారు అనుకుంటున్న తరుణంలో సడన్ గా సాయి రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.  సాయిరెడ్డి లిక్కర్ స్కాంలో ఎవ‌రినో ఇరికంచ‌బోయి తానే ఇరుక్కుంటున్నారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొదట కాకినాడ పోర్టు వ్యవ‌హారంలో విచార‌ణ‌కు వ‌చ్చిన సాయిరెడ్డి, ఆ సమయంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి తన అల్లుడని.. వారితో తనకు అసలు వ్యాపార సంబంధాలు లేవని చెప్పారు. కనీసం వారిని వారి సంస్ధలో ఓ ఉద్యోగం కోసం కూడా అడగలేదన్నారు. ఆ తర్వాత లిక్కర్ వ్యవహారానికి వచ్చే సరికి వారి ద్వారానే వ్యాపారం చేసుకోవటానికి వంద కోట్లు ఇప్పించానని తానే చెప్పుకొచ్చారు.  అర‌బిందో సంస్దతో త‌న‌కు ఆర్దిక లావాదేవీలు ఏమీ లేవు.. కేవ‌లం బంధుత్వం మాత్రమే ఉంద‌న్న సాయిరెడ్డి... అసలు ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఎందుకు వంద కోట్లు ఇప్పించారు?.. ఎవ‌రు అడ‌క్కపోయినా లిక్కర్ స్కాం గురించి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు?.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన హైద‌రాబాద్‌లో ఓసారి.. విజ‌య‌వాడ‌లో మ‌రోసారి త‌న నివాసంలో లిక్కర్ పాలసీపై ఏ హోదాతో చ‌ర్చించారు?  కేసిరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని మొదట జగన్‌కి తానే ప‌రిచ‌యం చేశాన‌ని చెప్పిన ఆయన ఆ త‌ర్వాత అర‌బిందో ద్వారా 100 కోట్లు ఎందుకు ఇప్పించారు?..  లిక్కర్ వ్యవ‌హారంతో ఏ సంబందం లేకుంటే వాళ్లకు అప్పు ఇప్పించాల్సిన అవ‌స‌రం ఏంటి?.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. . మొత్తం మీద ఈ వ్యవహారంలో సాయిరెడ్డి టార్గెట్ ఏంటి పార్టీ నుంచి తనకు పొమ్మనకుండా పొగ పెట్టిన వారిని టార్గెట్ చేయలనుకుంటున్నారా?.. పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తున్న ఆయన తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకోవడానికి ఇదంతా చేస్తున్నారా? సాయిరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? లిక్కర్ కేసులో ఇంకా ఎవరినైనా ఆయన ఇరికిస్తారా.. ఆయనే ఇరుక్కుంటారా?అసలు ఆ కేసు ఏ టర్న్ తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
విజయసాయిరెడ్డి ఇరికిస్తున్నారా?.. ఇరుక్కుంటున్నారా? Publish Date: Apr 30, 2025 5:54AM

మెట్రో రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో విచారణ

  మెట్రోస్టేషన్లు, రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లపై మెట్రో రైళ్లలో ప్రకటనపై పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్ మెట్రో రైలు తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ఇప్పుడు వేయడంలేదన్న ఏజీ పేర్కొన్నారు. మెమో దాఖలు చేసినట్లు తెలిపిన ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మెట్రో ట్రైన్లలో నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది.  న్యాయవాది నాగూర్‌ బాబు ఈ పిల్​ను వేశారు. అనంతరం న్యాయస్థానంలో ఆయన తన వాదనలు వినిపించారు. ‘బెట్టింగ్‌ యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ మెట్రో రైళ్లలో మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతోంది. మెట్రో రైళ్లలో ఈ అడ్వర్టైజ్​మెంట్స్​పై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించలేదని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
మెట్రో రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో విచారణ Publish Date: Apr 29, 2025 9:49PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆసుపత్రి నుంచి శ్రీ తేజ్ డిశ్చార్జ్

  సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ 5 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని తండ్రి భాస్కర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బన్నీనీ  ఏ11 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.  ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. బెయిల్ పేపర్లు ఆలస్యం కావటంతో ఆయన ఓ రోజు రాత్రి మొత్తం చంచల్‌గూడ జైలులో ఉండాల్సి వచ్చింది. అనంతరం అల్లు అర్జున్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాననని హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగి ఇప్పటికే దాదాపు 5 నెలలు గడిచిపోవటంతో చాలా మంది ఈ ఘటనను మర్చిపోయారు కూడా. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక్కడి నుంచి రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు సమాచారం
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆసుపత్రి నుంచి శ్రీ తేజ్ డిశ్చార్జ్ Publish Date: Apr 29, 2025 9:17PM

సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా బి.ఆర్. గవాయ్

  సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా  బి.ఆర్. గవాయ్ ఎన్నికయ్యారు.  గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. మే 14న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐ పదవి చేపడుతున్న రెండో దళితుడిగా జస్టిస్ గవాయ్. కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్‌ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్‌ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్‌ గవాయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అత్యున్నత న్యాయస్థానానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన  సేవలందించనున్నారు.  
సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా బి.ఆర్. గవాయ్ Publish Date: Apr 29, 2025 8:55PM

ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ : ప్రధాని

  జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కీలక వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే జాతీయ సంకల్పమని ప్రధాని పునరుద్ఘాటించారు.  ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో గట్టి బదులిస్తామని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో  అంతం చేస్తామని  ప్రధాని తెలిపారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.   
ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ :  ప్రధాని Publish Date: Apr 29, 2025 8:34PM

భూదాన్ భూముల వివాదం సోదాలపై ఈడీ కీలక ప్రకటన

    రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం..27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో ఐపీఎస్‌లు మహేశ్‌భగవత్‌, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. భూదాన్‌ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని గవర్నమెంట్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి ఏప్రిల్‌ 24న విచారణ చేపట్టారు.  నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో అక్రమాలు జరిగాయని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ప్రభుత్వంతోపాటు పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి భార్యలు, పిల్లలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ప్రభుత్వం, సీబీఐ, ఈడీతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ముగ్గురు ఐపీఎస్‌లు హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  
భూదాన్ భూముల వివాదం సోదాలపై ఈడీ కీలక ప్రకటన Publish Date: Apr 29, 2025 8:12PM

స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్..కర్మణ్యే వాధికారస్తే

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌‌ ఎక్స్‌లో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం  ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ట్వీట్టర్ వేదికగా స్మితా  స్పందించారు. భగవద్గీతలోని "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించారు. "పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా అత్యుత్తమంగా సేవలు అందించేందుకు ప్రయత్నించాను. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన టూరిస్ట్ ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది" అని ఆమె వివరించారు. తెలంగాణలో తొలిసారిగా, 2025-30 టూరిజం పాలసీ తీసుకొచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్షించబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన పునాది అవుతుంది.  శాఖ పనితీరును మళ్లీ ఆకళింపు చేసి, బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశాను. ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళికా మౌలికతల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నమ్మకం ఉంది’ అని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పర్యాటక శాఖలో పనిచేయడం గర్వంగా, గౌరవంగా ఉందని నమస్కారం సింబల్ జోడించారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌కు నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. మీరు టూరిజం లో చాలా మార్పు తీసుకొని వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  ఇటీవల హైదరాబాద్ శివార్లలోని కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపు వ్యవహారంలో స్మితా సబర్వాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఆమెపై బదిలీ వేటు పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక సంఘానికి బదిలీ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   
స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్..కర్మణ్యే వాధికారస్తే Publish Date: Apr 29, 2025 6:24PM

రేపే టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల

  విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. రేపు.. అంటే ఏప్రిల్‌ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేర‌కు విద్యాశాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. .ఈ సారి కొత్త‌గా మార్కుల‌తో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి  పదో తరగతి రిజల్ట్స్ విడుదల చేస్తారని సమాచారం.మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన ప‌ది ప‌రీక్ష‌ల‌కు 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను ntnews.com వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.   మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్‌ రిలీజ్‌ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది.మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.
రేపే టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల Publish Date: Apr 29, 2025 4:20PM

మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

  మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి.  మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలను భాగ్యనగరంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంపిటీషన్స్‌కు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదని సీఎం అన్నారు. విభాగాలవారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పోటీలు నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు  
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Publish Date: Apr 29, 2025 3:50PM

సభ సక్సెస్ సరే.. కానీ, ప్యూచరేంటి?

ఆపరేషన్ సక్సెస్ .. పేషెంట్ డెడ్  ఇదొక మెడికల్ ఇడియమ్.  అయితే రాజకీయాలలోనూ ఈ నానుడి తరచూ వింటూనే ఉంటాం. విజయవంతమైన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి కూడా విశ్లేషకులు అదే అంటున్నారు. అవును.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం (ఏప్రిల్ 27) ఘనంగా నిర్వ హించిన  బీఆర్ఎస్   రజతోత్సవ సభ, జన సమీకరణ వరకూ సక్సెస్ అయింది. ఆశించిన పది లక్షల మంది కాకున్నా, లక్షల్లోనే జనం సభకు హాజరయ్యారు. అయితే.. వచ్చిన జనాల్లో ఆ స్థాయిలో ఉత్సాహం కనిపించలేదు, అందుకనే  రాజకీయ విశ్లేషకులు ఆపరేషన్ సక్సెస్ .. పేషెంట్ డెడ్ అంటున్నారు. నిజానికి సభకు వచ్చిన జనాలు, పార్టీ క్యాడర్  మాత్రమే కాదు, వేదికను అలంకరించిన నాయకుల్లోనూ పెద్దగా ఉత్సాహం కనిపించిలేదు. చివరకు  కేసీఆర్ ఎంట్రీ కూడా చెప్పుకున్నంత గొప్పగా లేదని అంటున్నారు. ముఖ్యంగా.. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు  సభ  జరిగిన తీరుపై పెదవి విరుస్తున్నారు. జన సమీకరణ వరకు ఓకే కానీ.. క్యాడర్ లో ఉత్సాహం కనిపించలేదని అంటున్నారు. నాయకులు మొదలు క్యాడర్ వరకు ఎవరికి వారు పార్టీ రజతోత్సవ సభను  ఇంటి పండగ చేసుకున్నట్లు లేదని అంటున్నారు.    అంతే కాదు  ‘గుర్రాన్ని చెరువు వరకు తీసుకు రావచ్చును  కానీ నీటిని తాగించలేము’  అనే సామెతను గుర్తు చేస్తున్నారు. అంటే..  సభకు హాజరైన జనం, ముఖ్యంగా పార్టీ క్యాడర్ ఏదో వచ్చాం, వెళ్లాం అన్నట్లుగానే వచ్చి వెళ్ళారు తప్ప  వారిలో ఉత్సాహం అంతగా కనిపించలేదని అంటున్నారు. అందుకే  రజతోత్సవ సభ టీఆర్ఎస్  సభలా లేదని..  బీఆర్ఎస్ సభలా ఉందని సీనియర్ నాయకుడు ఒకరు చమత్కరించారు. అంటే, టీఆర్ఎస్  బీఆర్ఎస్ ఒకటి కాదనే అభిప్రాయం సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.     అదలా ఉంటే..  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు ప్రసంగంలోనూ వెనకటి వేడి వినిపించలేదని అంటున్నారు. అవును. బీఆర్ఎస్ సభ  టీఆర్ఎస్ సభలా లేదు కేసీఆర్ ప్రసంగం కేసీఆర్ ప్రసంగంలా లేదని అంటున్నారు. అయితే.. విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ భాషలో వచ్చిన మార్పును మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. సెన్సార్ కత్తెరకు పనిలేకుండా, ఆ .. పదం ఒక్కటైనా లేకుండా కేసీఆర్ ప్రసంగించడం అభినందనీయం అంటున్నారు. బహిరంగ సభ వేదిక నుంచి కేసీఆర్ ఇంత  చక్కటి భాషలో మాట్లాడడం ఇటీవల కాలంలో బహుశాఇదే మొదటి సారేమో అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ భాషలో వచ్చిన మార్పును అందరు స్వాగతిస్తున్నారు. అలాగే  కేసీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే, అందులో కొత్త దనం ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒకటికి వందసార్లు చెప్పిన విషయాలనే  కేసీఆర్ చెప్పారు, కాంగ్రస్ ప్రభుత్వం పై కేటీఆర్  చేసిన ఆరోపణలనే కేసీఆర్ చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా అవే విమర్శలు చేశారు. అదొక్కటే  తేడా మిగిలినదంతా సేమ్  టూ సేమ్’ , అన్నట్లుగా సాగింది. అందుకే..  కేసీఆర్ ప్రసంగం అంతగా రక్తి కట్టలేదని, ఉపన్యాసంలో ఊపు,ఉత్సాహం లేదని అంటున్నారు.  అలాగే, రజతోత్సవ సభ ద్వారా కేసీఆర్ పార్టీ నాయకులకు క్యాడర్’కు దశ దిశ నిర్దేశిస్తారు అనుకుంటే..  అసలు ఆ ఊసే లేదాని అంటున్నారు. నిజానికి కేసీఆర్ కు సైతం ముందడుగు ఎలా వేయాలి అనే విషయంలో ఒక క్లారిటీ లేనట్లుందని అంటున్నారు. అలాగే.. పార్టీ నాయకత్వం,వారసత్వం విషయంలో కుటుంబంలో ముదిరిన విభేదాలు సైతం కేసీఆర్ కు తలనొప్పిగా మారాయంటున్నారు.  అందుకే.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ పార్టీలో ఉత్సాహం నింపడంలో విఫలమైందని అంటున్నారు. అందుకే సభ సక్సెస్ అయినా పార్టీ  ఫ్యూచర్ ఏమిటి అనే విషయంలో క్లారిటీ రాలేదని అంటున్నారు. అయితే, ముందు ముందు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? పార్టీ అంతర్గత విభేదాలను ఎలా  చక్క దిద్దుతారు ? అనే  దానిపైనే, బీఆర్ఎస్ భవిష్యత్ ఆధార పడి ఉంటుందని అంటున్నారు.
సభ సక్సెస్ సరే..  కానీ, ప్యూచరేంటి? Publish Date: Apr 29, 2025 3:39PM

ఉగ్రదాడి బాధిత కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం

  జమ్ముకాశ్మీర్  పహల్గామ్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన  మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం విరాళం ప్రకటించింది. పార్టీ తరపున ₹50 లక్షల ఆర్ధిక సహాయం, అలాగే జనసేన పార్టీ ప్రమాద బీమా నుండి ₹5 లక్షల ఇన్సూరెన్స్ తో కలిపి మొత్తంగా ₹55 లక్షలు అందించనున్నామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరుపున ఉగ్ర మృతులకు నివాళులు  అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.  క్రియాశీలక జనసైనికుడు మధుసూదన రావు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కుటుంబపెద్ద అయిన మధుసూదన్ చనిపోవడం బాధకరమని అన్నారు.  డబ్బుతో ప్రాణాలకు విలువ కట్టలేమని, కానీ ఈ సాహయం కుటుంబపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అంతేగాక ఈ రోజు ఆర్థిక సహాయం చేసి వదిలేయడం కాకుండా మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన ఎల్లవేళలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. 
ఉగ్రదాడి బాధిత  కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం Publish Date: Apr 29, 2025 3:05PM

అసెంబ్లీలో చంద్రబాబు తెలంగాణ పదం నిషేధించారా? కేసీఆర్ ఆరోపణల్లో వాస్తవం ఉందా?!

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగంలో గతంలోని వాడి, వేడీ కనిపించలేదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పార్టీ నేతలు, శ్రేణులే కేసీఆర్ ప్రసంగం చప్పగా ఉందని పెదవి విరుస్తున్నారు. ఆయన పిలుపు మేరకు నేతలు, క్యాడర్ శ్రమించి సిల్వర్ జూబ్లీ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించారు. అయితే ఆ వచ్చిన వారిని ఆకట్టుకునే విధంగా అయితే కేసీఆర్ ప్రసంగం లేదన్న భావన పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ తన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను టార్గెట్ చేయడానికీ, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికే పరిమితం చేశారు తప్ప.. బీజేపీ గురించి ఒక్కటంటే ఒక్క మాట లేదు. ఒక్క విమర్శ లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్నట్లుగా బీజేపీ ఎదుగుతున్న సూచనలకు కనిపిస్తున్నా కేసీఆర్ మాత్రం ఆ పార్టీపై చిన్నపాటి విమర్శ చేయడానికి కూడా ఇష్టపడలేదన్నట్లుగా ప్రసంగించారని పార్టీ క్యాడర్ నిరుత్సాహంగా చెబుతోంది. అన్నిటికీ మించి అసందర్భంగా చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని  నిషేధించారంటూ వైల్డ్ ఆరోపణ ఒకటి చేసేశారు. చంద్రబాబు ఆదేశంతోనే అప్పటి స్పీకర్ ప్రతిభాభారతి సభలో తెలంగాణ నినాదం వినిపించకూడదంటూ రూలింగ్ పాస్ చేశారని కేసీఆర్ అన్నారు.   కేసీఆర్ ప్రసంగంలో మునుపటి వాడీవేడీ లేకపోవడం అటుంచి కేసీఆర్ తన ప్రసంగంలో చంద్రబాబు గురించి అసత్యాలు చెప్పారనీ, తద్వారా జనంలో చంద్రబాబును తెలంగాణకు బూచిగా చూపించి, ఆయనకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ కు ఉన్న అనుబంధం తెలంగాణకు నష్టం చేకూరుస్తుందని చెప్పడానికి నానా ప్రయాసా పడ్డారని పార్టీ వర్గాలే అంటున్నాయి. అప్పడు ఏం జరిగిందో తెలిసిన వారు కేసీఆర్ నోట ఈ అవాస్తవాలు ఏంటి? ఆయన బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారా? కుమార్తె  కవిత మద్యం కుంభకోణం కేసు, కుమారుడు కేటీఆర్ పై కేసులు, అదే విధంగా ఫోన్ ట్యాంపరింగ్ కేసుల భయంతో బీజేపీని శరణు జొచ్చుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆప్పుడు, ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి చంద్రబాబు పేరు ఉపయోంచుకుంటున్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఏనాడు బీఆర్ఎస్ ప్రస్తావన కానీ, కేసీఆర్ ప్రస్తావనను కానీ తీసుకువచ్చిన సందర్భం లేదు. కానీ కేసీఆర్ కు మాత్రం తన రాజకీయం కోసం చంద్రబాబు పేరు వాడని సందర్భం లేదు.  ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించారనడం పూర్తిగా అవాస్తవం.  అప్పుడు అసలు జరిగిందేంటంటే.. 2001లో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి టీఆర్ఎస్ ను స్థాపించారు.  అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) అప్పటి వాజ్ పేయి ప్రభుత్వానికి ఒక తీర్మానాన్ని పంపింది. అ  తక్షణమే రెండో ఎస్ఆర్సి ఏర్పాటు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను పరిశీలించాలని అందులో కోరింది. అయితే అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్ కే అద్వానీ అందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.  చిన్న రాష్ట్రాలు ఆచరణ సాధ్యం కాదనీ, చిన్న రాష్ట్రాల వల్ల దేశ సమగ్రతకు ముప్పనీ పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు అసలు ప్రాతినిథ్యమే లేదు.   ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు సభలో జై తెలంగాణ నినాదాలు చేయడం ప్రారంభించారు. వారి వైఖరి కారణంగా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలోనే అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి సభలో నినాదాలను నిషేధిస్తూ రూలింగ్ ఇచ్చారు. అయితే ఆ రూలింగ్ లో ఎక్కడా తెలంగాణ నినాదాలను నిషేధిస్తున్నట్లు ఎక్కడా లేదు. మొత్తంగా సభా కార్యక్రమాలను అడ్డుకునే విధంగా సభ్యులు నినాదాలు చేయడాన్ని నిషేధిస్తూ అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి రూలింగ్ ఇచ్చారు.  తెలంగాణ నినాదాల బహిష్కరణ అనే మాటను కేసీఆర్ తన రాజకీయ అజెండా మేరకు తీసుకువచ్చి చంద్రబాబుకు ఆపాదించారు. అదిగో సరిగ్గా అప్పటి నుంచే టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య స్నేహ బంధం ఏర్పడింది. 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీలూ కలిసి పని చేయడానికి ఒక అంగీకారానికి వచ్చేలా చేసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమి విజయం సాధించి వైఎస్ ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.  కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి దక్కింది. సో చెప్పొచ్చేదేంటంటే.. నాడు, నేడూ కూడా చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ఫోకస్ చేసి రాజకీయలబ్ధి పొందాలన్నది కేసీఆర్ ప్రయత్నం అప్పడూ.. ఇప్పుడూ కూడా. అందుకే సిల్వర్ జూబ్లీ సభలో కూడా కేసీఆర్ చంద్రబాబు జపమే చేశారు. ఆయనపై విరమ్శలు గుప్పించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా ఉంచాలన్నదే ఆయన ప్రయత్నమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
  అసెంబ్లీలో చంద్రబాబు తెలంగాణ పదం నిషేధించారా? కేసీఆర్ ఆరోపణల్లో వాస్తవం ఉందా?! Publish Date: Apr 29, 2025 2:59PM

పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన చిరుత.. ఎక్కడంటే?

  తమిళనాడు నీలగిరి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించింది. రాత్రిపూట ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చి గదిలో కలియతిరిగింది. లోపల ఎవరూ కనిపించకపోవడంతో కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఘటన  జరిగింది. అది గమనించిన ఓ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యారు.  లోపల ఎవరు కనిపించకపోవడంతో అక్కడి నుంచి పులి బయటకు వెళ్లిపోయింది. లోపల ఉన్న కానిస్టేబుల్ వెంటనే తలుపులు మూసేశారు.నడువట్టం ప్రాంతంలో చిరుతల సంచారం ఇటీవల ఎక్కువైందని, ఫారెస్ట్ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంది వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది
పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన చిరుత.. ఎక్కడంటే? Publish Date: Apr 29, 2025 2:28PM

రాహుల్ వినతిని మోడీ మన్నిస్తారా?

జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని  ఆ లేఖలో రాహుల్ కోరారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంటు సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే తర్వాతి రోజు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. భారత ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జరిగిన అఖిల పక్ష సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని పార్టీల నేత లు హాజరయ్యారు. ఆ సమావేశంలో భారత ప్రభుత్వం చేపట్టే చర్యలన్నింటికీ మద్దతుగా ఉంటామని, వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అయితే ఆ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరుకాకపోవడాన్ని మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఇటువంటి ముఖ్యమైన సమావేశానికి ప్రధాని మోడీ వచ్చి అక్కడ జరిగిన సంఘటనలను వివరించి ఉంటే బాగుండేదని.. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రధాని మోడీ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు తాజాగా ఖర్గే, రాహుల్ రాసిన లేఖపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
రాహుల్ వినతిని మోడీ మన్నిస్తారా? Publish Date: Apr 29, 2025 2:12PM

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు

వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు, ఆర్థిక అరాచకత్వం, కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా నేరాలను అరికట్టాల్సిన పోలీసు అధికారులే నేరాలకు పాల్పడి జగన్ అండ చూసుకుని అక్రమాలు, అవకతవకలకు తెగడిన సంఘటనలు నివ్వెర పరుస్తున్నాయి. అటువంటి వారిలో జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా, ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీఎస్సార్ ఆంజనేయులు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఇప్పటికే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై, విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఆయన ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకణలో అవకతవకలు జరిగాయనీ, ఏపీపీఎస్సీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు హయాంలో జరిగిన అవకతవకలపై అందిన నివేదిక ఆధారంగా  కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీజీపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పీఎస్ఆర్‌పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో తాజాగా మోసం, నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయని, ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.   
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు Publish Date: Apr 29, 2025 1:20PM

కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు.. నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్రం అప్రమత్తం

కాశ్మీర్ లోని పహల్గాంలో గత వారం జరిగిన ఉగ్ర దాడి ఉద్రిక్తతలు ఇంకా చల్లారక ముందే.. అదే కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రవాదులకు ముష్కరులు ప్రణాళికలు రచిస్తున్నారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలలో స్థానికేతరులు, భద్రతా దళాలు టార్గెట్ గా  మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పహల్గాం దాడి తరువాత కేంద్రం కాశ్మీర్ లోయలోని ఉగ్రవాదుల గృహాలను ధ్వసం చేయడానికి ప్రతీకారంగా మరిన్ని దాడులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాల నుంచి అందిన సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా కాశ్మీర్ లోని 84 పర్యాటక ప్రాంతాలలో 48 ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది.   ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించడం లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి పర్యాటకుల కోసం తెరుస్తామని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.  ప్రస్తుతం అనుమతి ఇస్తున్న పర్యాటక ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. భ‌ద్ర‌త క‌ల్పించిన ప్రాంతాల‌లోకి ప‌ర్యాట‌కుల ఎటువంటి భ‌యం లేకుండా సంచ‌రించ‌వ‌చ్చ‌ని భరోసా ఇచ్చింది.  ప్ర‌తి ప‌ర్యాట‌కుడికి ఆయా ప్రాంతాల‌లో ప్ర‌త్యేక ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా భ‌ద్ర‌తా సిబ్బందిని నియమించింది.  
కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు.. నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్రం అప్రమత్తం Publish Date: Apr 29, 2025 12:50PM

ఏబీవీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. బెజవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం (ఏప్రిల్ 28) విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేస్తూ తుది తీర్పు వెలువడే వరకూ   విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది. ఇంతకీ అప్పట్లో ఏబీవీపై నమోదైన కేసు ఏమిటంటే భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో ఏబీవీ అవకతవకలకు పాల్పడ్డారని. అప్పటి జగన్ సర్కార్ 2001 మార్చిలో ఏబీవీపై కేసు నమోదు చేసింది. ఆ ఆరోపణలతోనే ఏబీవీని అప్పటి జగన్ సర్కార్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీవీ అలుపెరుగని న్యాయపోరాటం చేశారు.   తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో అప్పటి జగన్ సర్కార్ కు ఏబీవీ సస్పెన్షన్ ను ఎత్తివేయడం వినా మరో గ్యతంతరం లేకపోయింది. అయితే ఆయనను సర్వీసులోకి తీసుకున్నట్లే తీసుకుని ఆ మరుసటి రోజే మళ్లీ జగన్ సర్కార్ ఆయనను అవే అభి యోగాలతో సస్పెండ్ చేసింది.  దీంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాట్ రద్దు చేయడంతో నాటి ప్రభుత్వం ఆయన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన మరలా ప్రింటింగ్ అండ్ స్పేషనరీ విభాగం అడిషనల్ డీజీగా బాధ్యతలు చేపట్టి అదే రోజు పదవీ విరమణ చేశారు. అదలా ఉంటే తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఏబీవీ 2022లో హైకోర్టులో  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి.. విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది. 
ఏబీవీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. బెజవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే Publish Date: Apr 29, 2025 12:39PM

యుద్దానికి ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్?

పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో   పాకిస్థాన్ తో మరో యుద్ధం తధ్యమనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా మీడియాలో అయితే.. యుద్ధం వచ్చినట్లే కథనాలు వస్తున్నాయి. అయితే  ఇలా  యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి అంటూ వస్తున్న మీడియా కథనాల్లో ఆధారాలకంటే, ఊహాగానలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరో వంక పాకిస్థాన్  ఉలికి పాటు చూస్తుంటే.. పాక్ నేతల్లో యుద్ద భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే  పాక్  మీడియాలో వస్తున్న కథనాలు గమనిస్తే..  యుద్ధానికి ముందే పాక్  నేతలు పలాయన మంత్రం జపిస్తున్నట్లు అనిపిస్తోందని  అంటున్నారు. నిజానికి  ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాల చితికి పోయిన పాకిస్థాన్  యుద్ధంచేసే స్థితిలో   లేదని  అంటున్నారు.  నిజానికి  పాకిస్థాన్  ఆర్థిక పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉన్నదో  ఆ దేశ ప్రధాని షేహబాబ్ షరీఫ్ స్వయంగా చెప్పుకున్నారు. అవును ప్రపంచ  దేశాలు తమను బిచ్చగాళ్ళను చుసినట్లు చూస్తున్నాయని  షరీఫ్  చెప్పుకున్నారు. ప్రధాని చెప్పిందే నిజం అయితే  ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా, బాధాకరంగా వుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. అలాగే  పాక్ లో బ్రెడ్ ముక్క, రొట్టె ముక్క రేట్లు, పాలు, పెరుగు ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి.  ద్రవ్యోల్బణం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోందని అంటున్నారు. అందుకే  పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి  అణ్వాయుధ  బూచిని చూపించి అయినా యుద్ధం రాకుండా అడ్డుకునే విఫల ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.  సరే  పాక్  ప్రగల్బాలు ఎలా ఉన్నా.. భారత దేశం, మోదీ ప్రభుత్వం నిజంగా యుద్ధానికి సిద్ధంగా వుందా  అంటే ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు రోజులకు బీహార్ మధుబనిలో చేసిన ప్రసంగంలో  ఉగ్రదాడులకు తెగబడిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా.. వెతికి వెంటాడి శిక్షిస్తామని గట్టి హెచ్చరిక చేయడంతో పాటుగా ఉగ్రవాదులకు సహకరించిన వారినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.   ముఖ్యంగా  ప్రధాని మోదీ  ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి, ఆఖరి మజిలీగా మిగిలిన కొద్ది పాటి భూ భాగాన్ని మట్టిలో కలిపేస్తాం అని చేసిన హెచ్చరిక పాకిస్థాన్ ను ఉద్దేశించి చేసినదే అంటున్నారు. అంటే  మోదీ యుద్ద భేరి మొగించినట్లే అనుకోవచ్చని అంటున్నారు.  అదలా ఉంచితే..  తాజాగా ఆర్ఎస్ఎస్  అధినేత మోహన్ భగవత్    చేసిన వ్యాఖ్య కూడా యుద్దానికి గ్రీన్ సిగ్నల్ గానే భావించవలసి ఉంటుందని అంటున్నారు. మోహన్ భగవత్   ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమలో ప్రసంగిస్తూ.. భారత దేశం పొరుగే వారికి అపాయం చేయదు. హానీ తలపెట్టదు. కానీ  రాక్షసత్వం ప్రబలితే మాత్రం భారత్‌కు ప్రతిస్పందించడం మినహా మరో మార్గం ఉండదు. శతృవును  వదిలి పెట్టదు  అని స్పష్టం చేశారు. అంతే కాదు ప్రజలకు రక్షణ కల్పించడం పాలకుల ప్రధాన కర్తవ్యం.  పాలకులు ఆ బాధ్యతను నిర్వహించాలంటూ మోదీ ప్రభుత్వానికి కర్తవ్య బోధ చేశారు.  హిందూమతం మూల సూత్రాల్లో అహింసే ప్రధానమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, స్వీయరక్షణ కోసం దుర్మార్గులను దీటుగా ఎదుర్కోవాలనేది కూడా హిందూ ధర్మంలో ఓ కీలక అంశమని వివరించారు. దుర్మాగులకు గుణపాఠం చెప్పడం కూడా ఇందులో భాగమేనని అన్నారు. ముఖ్యంగా అమాయకులను మతం అడిగి మరీ కాల్చి చంపారు.  ద్వేషం, హింస,పగలకు పాల్పడడమే కాదు.. ఇతరుల ద్వేషాన్ని, పగను, హింసను  మౌనంగా భరించరాదు..  అదే హిందూ ధర్మం అని  అని పేర్కొన్నారు. కాగా..  ప్రధాని మోదీ మధుబని ( బీహార్) లో చేసిన  వ్యాఖ్యలు, ఢిల్హిలో మోహన్ భగవత్   చేసిన వ్యాఖ్యలు ఒకే అర్థం ఇస్తున్నాయని అంటున్నారు.  యుద్దానికి  మోదీ ప్రభుత్వం సిద్దంగా వుంది.. అందుకు ఆర్ఎస్ఎస్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. అయితే.. అదే అంతిమ  నిర్ణయమా, అంటే కాదని అంటున్నారు.
యుద్దానికి ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్? Publish Date: Apr 29, 2025 10:56AM

తెలుగుదేశం మహిళా నేత గాయత్రి సస్పెన్షన్

తెలుగుదేశంమహిళా విభాగం నేత గాయత్రిని పార్టీ సస్పెండ్ చేసింది. భారత్, పాక్ మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు, ప్రసంగలే కారణమని చెబుతున్నారు. పార్టీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరచూరి అశోక్ బాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.   గాయత్రిపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణమని అంటున్నారు.   విజయవాడకు సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోవైసీపీ నేతలు, కార్యకర్తల విమర్శలకు కౌంటరిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఆమెపై వెల్లువెత్తిన విమర్శల కారణంగానే గాయత్రి సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాకిస్థాన్, భారత్ సంబంధాలపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం తెలపడమే గాయత్ని సస్పెన్షన్ కు కారణంగా చెబుతున్నారు.  ముఖ్యంగా ఆమె భారత ఇతిహాసాలు మహాభారతం, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గాయత్రిని సస్పెండ్ చేయడమే కాకుండా దర్యాప్తునకు కూడా తెలుగుదేశం ఆదేశించింది.   గాయత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ  హిందూ ఐటీ సెల్, బిజెపి ఆర్ఎస్ఎస్ ల డిమాండ్ మేరకే గాయత్రిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ సస్పెన్షన్ పై గాయత్రి స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. 
తెలుగుదేశం మహిళా నేత గాయత్రి సస్పెన్షన్ Publish Date: Apr 29, 2025 10:35AM

విజయవంతమైన నాయకుడు కావడానికి చాణక్యుడు చెప్పిన సలహాలు.. !

  ఒక వ్యక్తి చాణక్య నీతి సూత్రాలను లోతుగా అధ్యయనం చేస్తే అతను జీవితంలో ప్రతి అడుగులోనూ విజయం సాధిస్తాడు. చాణక్యుడి బోధనలు మానవాళిని సరైన మార్గంలోకి తీసుకురావడంలో సహాయపడతాయి. ప్రతి వ్యక్తి జీవితంలో పురోగతి సాధించాలని కోరుకుంటాడు. చాలా మంది నాయకత్వం కావాలని కోరుకుంటారు.  కానీ కొన్ని లోపాల కారణంగా వారు వెనుకబడిపోతారు. చాణక్య నీతిలో అలాంటి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి.  వాటిని దృష్టిలో ఉంచుకుంటే ఎవరైనా సులభంగా మంచి నాయకుడు  కావచ్చట. చాణక్యుడు దార్శనిక నాయకత్వం  ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఒక నాయకుడికి స్పష్టమైన దృష్టి ఉంటుంది. ఇది జట్టును ఒక సాధారణ లక్ష్యం వైపు సమలేఖనం చేస్తుంది. సమర్థవంతమైన నాయకుడిగా మారడానికి స్పష్టమైన ఆలోచించన,  పారదర్శకత..  నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతాయట. ఏదైనా పెద్ద పనిని ప్లాన్ చేసే ముందు లేదా తర్వాత అనేక రకాల అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈలోగా ఓపికగల నాయకుడు తన ధైర్యాన్ని తగ్గించుకోడు లేదా జట్టును కూడా కుంగిపోనివ్వడు. సమస్యలకు త్వరిత,  సంతోషకరమైన పరిష్కారాలను కనుగొనడం, పరిస్థితులను మార్చడంలో  నాయకుడు  కీలక పాత్ర పోషిస్తాడు.  జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలనుకుంటే మొదట  సమయం  ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. సమయం విలువను అర్థం చేసుకున్న వారు జీవితంలో శిఖరాగ్రానికి చేరుకుంటారు. నాయకుడు స్వయంగా తన పనిలో ఆలస్యంగా వస్తే అది తన చుట్టూ ఉన్న వారిపై  చెడు ప్రభావం చూపుతుంది. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన తెలివితేటలతో ప్రజలను తన వైపుకు ఆకర్షించుకోవాలి,  కార్యాలయంలో పని చేయాలి. నిజాయితీగా పనిచేస్తున్నట్టు అందరికీ   కనిపించాలి. అప్పుడు ఆ వ్యక్తి విలువ పెరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తి తమ నాయకుడుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. పరిమిత వనరులతో,  ప్రతికూల పరిస్థితులలో తమ లక్ష్యాలను సాధించే వ్యక్తులు నాయకులు అయ్యే గుణాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే నేటి యుగంలో నిర్వహణ ఒక వ్యక్తి నుండి బహుళ పనులను ఆశిస్తుంది. ప్రతి ఒక్కరు పనిలో సమర్ధవంతంగా ఉంటే, అది వారిని  నాయకుడిగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తుంది.                                                        *రూపశ్రీ.
విజయవంతమైన నాయకుడు కావడానికి చాణక్యుడు చెప్పిన సలహాలు.. ! Publish Date: Apr 29, 2025 9:30AM

మైండ్ పవర్ పెంచే మూడు సూపర్ డ్రింక్స్..!

వేసవిలో మండే ఎండ అయినా, ఆఫీసులో బిజీ జీవితం అయినా, మానసిక అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఒక సమస్యగా మారాయి. పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరూ పదునైన మెదడు,  మంచి ఏకాగ్రతను కోరుకుంటారు. అయితే మెదడుకు  పదును పెట్టే మరియు జ్ఞాపకశక్తిని బలోపేతం చేసే 3 సూపర్ డ్రింక్స్‌ను న్యూరాలజిస్ట్ లు సిఫార్సు చేస్తున్నారు.  ఇవి చాలా నేచురల్ డ్రింక్స్.  అలాగే వీటిని పెద్ద కష్టపడక్కర్లేకుండానే తయారు చేసి తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. మనం తినేవి మరియు త్రాగేవి మన మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఉదయం తీసుకునే కొన్ని పానీయాలు మీ మెదడు శక్తిని, దృష్టిని మరియు జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుతాయి. సూపర్ డ్రింక్స్ ఇవే.. గ్రీన్ టీ.. గ్రీన్ టీలో లభించే అమైనో ఆమ్లం 'ఎల్-థియనిన్' మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు న్యూరాన్‌లను దెబ్బతినకుండా కాపాడతాయి.   మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.  మనస్సు అప్రమత్తంగా ఉంటుంది. ఆర్గానిక్ కాఫీ + MCT ఆయిల్.. ఆర్గానిక్ కాఫీకి MCT ఆయిల్ (మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్) కలిపితే, అది మెదడుకు ఇంధనంగా పనిచేస్తుందని చెబుతున్నారు.  ఈ మిశ్రమం మెదడు మొద్దుబారినట్టు ఉండటాన్ని తొలగిస్తుంది.  చురుకుదనాన్ని నిలిపి ఉంచుతుంది. ఈ పానీయం 'కీటోజెనిక్ డైట్'లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.  మానసిక అలసట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  మెగ్నీషియం అధికంగా ఉండే నీరు.. మెగ్నీషియం మన మెదడు పనితీరుకు చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను కాపాడుతుంది,  ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు కణాలు మెరుగ్గా పనిచేయడానికి రోజుకు కనీసం ఒక బాటిల్ మెగ్నీషియం అధికంగా ఉండే మినరల్ వాటర్ తాగాలట.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మైండ్ పవర్ పెంచే మూడు సూపర్ డ్రింక్స్..! Publish Date: Apr 29, 2025 9:30AM

14 ఏళ్లు.. 35 బంతులు.. 100.. ప‌రుగులు.. వాహ్ వైభవ్ సూర్యవంశి

13 ఏళ్ల వ‌య‌సులో బీహార్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ అండర్ 19 యూత్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై 58 బాల్స్ లో సెంచెరీ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్  టీ20 క్రికెట్ లో హాఫ్ సంచెరీ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్ (14 సం. 32 రో.)  సీనియ‌ర్ క్రికెట్ లో సెంచ‌రీ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్   హెచ్చ‌రిక మీరు ఈ విన్యాసాలు ద‌య చేసి ట్రై చేయ‌వ‌ద్దు.. ఇది నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన‌ది అంటూ ఒక్కో యాడ్ లో మ‌నం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇది  క్రికెట్ హెచ్చ‌రికః మీకు కూడా 14 ఏళ్లు వ‌చ్చాయి క‌దాని ఇలాంటి బీభ‌త్స‌మైన ఇన్నింగ్స్ ఆడ‌కండి. మీక‌న్నా వ‌య‌సులో పెద్ద‌వారైన క్రికెట‌ర్లు వెంట‌నే రిటైర్మెంట్ తీసుకుంటార‌ని ఈ హెచ్చ‌రిక‌ను మార్చి రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న కుర్రాడు.. కాదు కాదు 14 ఏళ్ల చిచ్చ‌ర పిడుగు.. చేసిన విధ్వంసానికి కొత్త పేరు క‌నిపెట్టాలేమో. అవేం సిక్సులు.. ఒళ్లంతా తిరిగిపోతూ ఏకంగా 11 సిక్సులు బాద‌డంతో..  ఒక్కొక్క‌రికీ దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింద‌ని చెప్పాల్సి ఉంటుంది. టాప్ ఫోర్ లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కి చెందిన బౌల‌ర్ల‌ను ఎక్క‌డో చిట్ట చివ‌రున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కి యంగ్ కిడ్ వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌చ్చి వారికి నైట్ మేర్ చూపించాడు.  విచిత్ర‌మేంటంటే సూప‌ర్ స్ట్రైక‌ర్, హ‌య్య‌స్ట్ సిక్స‌ర్స్ వంటి వాటితో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అంటూ మొత్తం నాలుగు అవార్డులు తీసుకున్న సూర్య‌వంశీతో పాటు ఇత‌డికి బౌలింగ్ వేసి ప‌ది డాట్ బాల్స్ వేసిన ర‌షీద్ ఖాన్ కి హ‌య్య‌స్ట్ డాట్ బాల్స్ అవార్డు తీస్కోవ‌డం. ఇదెలా విచిత్ర‌మంటే.. ఇంత విధ్వంసంలో ఆ మాత్రం డాట్ బాల్స్ వేసిన ఒకే ఒక్క‌డు ర‌షీద్.  ఇక గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ ని ర‌వి శాస్త్రీ ఎంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే సిగ్గుతో ఆ బాలుడి గురించి ఏం మాట్లాడ‌డే.  ఇదిలా ఉంటే.. ఇట్స్ హిజ్ ప్లే గ్రౌండ్.. అంటూ డిజిట‌ల్ స్క్రీన్ పై ప‌డ్డం ఎంత‌టి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉండాలో క‌దా అనిపించింది. నేను బౌల‌ర్ని చూడ‌ను బాల్ ని మాత్ర‌మే చూస్తా అంటూ పెద్ద పెద్ద బౌల‌ర్ల‌ను ఊచ కోత కోసిన‌ ఈ కుర్రాడికి ఐపీఎల్ మొత్తం పెట్టిన పేరు బాస్ బేబీ.  స‌చిన్ టెండూల్క‌ర్ పై అయినా పాకిస్థాన్ వెళ్లిన‌పుడు చిన్న పిల్లాడికి ఎలా బౌలింగ్ వేయాలా అని జాలి చూపిస్తే.. ఇంత చిన్న పిల్లాడి చేత ఇంత‌టి ఇంట‌ర్నేష‌న‌ల్ బౌల‌ర్ల‌యిన మాకు ఎంతటి ఘోర ప‌రాభ‌వంరా నాయ‌నా! అంటూ సిరాజ్, ఇషాంత్ శ‌ర్మ‌, ర‌షీద్ ఖాన్, ప్ర‌సిధ్ కృష్ణ ప‌డ్డ బాధ వ‌ర్ణ‌నాతీతం. వీరంద‌రిలోకీ ప్ర‌సిద్ ఒకింత అదృష్ట‌వంతుడు.. 35 బాల్స్ కి వ‌న్నాట్ వ‌న్ బాదిన ఈ టోర్న‌డో, ఈ తుఫాన్ ని ఇలాగైనా నేను కంట్రోల్ చేశాన‌న్న సంతృప్తిని మిగుల్చకున్నాడు ప్ర‌సిద్.. ఇప్పుడు స‌మ‌స్య ఏంటంటే ఇంత చిన్న వ‌య‌సులో ఇత‌డు సెట్ చేసిన రికార్డులు ఈ వ‌య‌సులో క్రికెట్ ప్రాక్టీస్ చేసే కుర్రాళ్ల‌పై చాలా చాలా ప్రెష‌ర్ ప‌డుతుందంటున్నారు కామెంట‌రేట‌ర్లు.  ఈ కుర్రాడ్ని పిక్ చేసిన రాహుల్ ద్రావిడ్ కి ఎంత చెడ్డ పేరంటే.. ఇంత భీక‌ర బౌల‌ర్ల‌కు ఈ వ‌య‌సు పిల్లాడ్ని వ‌దిలి బ‌లి  పెడ‌తారా ఎక్క‌డైనా? అంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సోమవారం (ఏప్రిల్ 28) వైభవ్ సూర్యవంశి ఆనందానికి ఒక హద్దంటూ లేదు..  తన తండ్రి  క్రికెటర్ కావాల‌నుకున్నారు. కానీ ఆయ‌న కాలేక పోయారు. అందుకే ఆ క‌సి కొద్దీ బ్రియాన్ లారా ఇన్ స్పిరేష‌న్ తో తాను క్రికెట్ ని చిన్న నాడే సీరియ‌స్ గా తీసుకున్నాననీ,  2 ఏళ్ల పాటు ఇంట్లోనే ఆడి, ఆ త‌ర్వాత స‌మ‌స్తిపూర్.. ఆపై పాట్నాలో ట్రైనింగ్ తీసుకుని..  ఆ త‌ర్వాత‌ బోర్డుకు ఆడాననీ చెప్పిన సూర్యవంశీ.. ఆపై ఐపీఎల్ లో అడుగు పెట్టి ఇదిగో బ్రయన్ లారా ఇన్సిపిరేషన్ తో ఇలా విధ్వంస ర‌చ‌న‌లో వంద మంది సెహ్వాగ్ ల‌ను, వేయి మంది రిష‌భ్ పంత్ ల‌నీ దాటేశాడు.. ఆల్ ఫార్మాట్ క్రికెట్ లో కొత్త చ‌రిత్ర లిఖించాడు.  16 ఏళ్ల‌కే క్రికెట్ లో అడుగు పెట్టాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ విర్ర‌వీగుతూ వ‌చ్చిన స‌చిన్ ని అయితే ఎప్పుడో వెన‌క్కు నెట్టేశాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. తాను ఇండియ‌న్ క్రికెట్ కి రెప్ర‌జెంట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆశిస్తున్న వైభ‌వ్ త్వ‌ర‌లోనే ఆ ఫీట్ కూడా షురూ చేసి.. ఎంద‌రు బౌల‌ర్లకు నిద్ర లేకుండా  చేస్తాడో చెప్ప‌లేం.  మూడో మ్యాచ్ కే త‌న ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి.. మూడు చెరువుల నీరు తాగించిన.. వైభ‌వ్  ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని విధ్వంసాలు సృష్టించి కొత్త క్రికెట్ చ‌రిత్ర‌ను రాయాల‌ని ఆశిస్తూ... బేబీ బాస్  ద వ‌ర‌ల్డ్ క్రికెట్ ఈజ్  యూవ‌ర్ ప్లే గ్రౌండ్.. రా క‌న్నా.. ప్లే కిడ్.. బిగ్ క్రికెట్.. హ్యాపీ క్రికెట్ జ‌ర్నీ
14 ఏళ్లు..  35 బంతులు.. 100.. ప‌రుగులు..     వాహ్ వైభవ్ సూర్యవంశి Publish Date: Apr 29, 2025 8:11AM

14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. ఆపై సెంచరీ.. వైభవ్ సూర్యవంశి ఓ అద్భుతం

రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. 209 పరుగులను ఇంకా 4.1 ఓవర్లు ఉండగానే ఛేదించింది. వరుస పరాజయాలతో కునారిల్లి ఉన్న జట్టు ఇంత వరకూ ఛేదనలో తడబడుతూ వచ్చింది. అయితే సోమవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కొండంత లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశింది. అయితే ఈ ఛేదన ఇంత సునాయాసం కావడానికి కారణం మాత్రం వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. వైభవ్ సూర్య వంశీ కూడా 14 ఏళ్ల పిన్న వయస్సులోనే ఐపీఎల్ లో అరంగేట్రం చేశారు. అలా ఐపీఎల్ లో ఆడిన  అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అయతే అక్కడితో ఆగిపోలేదు. ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాది ఔరా అనిపించాడు. ఇప్పుడు సోమవారం ( ఏప్రిల్ 29) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఐపీఎల్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేనా ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వైభవ్ సూర్యవంశి 35 బంతుల్లో 11 సిక్స్ లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు.  సరే ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 201 పరుగుల విజయలక్ష్యాన్ని 14.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించేసి విజయాన్ని అందుకుంది. ఆర్ ఆర్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశి 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లలో 70 నాటౌట్ చెలరేగి ఆడారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.  
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. ఆపై సెంచరీ.. వైభవ్ సూర్యవంశి ఓ అద్భుతం Publish Date: Apr 28, 2025 11:24PM

రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంటకసత్యనారాయణ.. విధేయత, సీనియారిటీకే పెద్దపీట

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత పాక వెంకటసత్యనారాయణ ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. బీజేపీతో పాకా సత్యనారాయణకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.ఆర్ఎ్ఎస్ నేపథ్యం ఉన్న పాక సత్యనారాయణ బీజేపీలో వివిధ స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నేపథ్యం కలిగిన ఆయన, పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిత్వం కోసం పార్టీ సీరియస్ గా పరిశీలనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.   పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం చెందిన బిజెపి సీనియర్ నాయకుడైన పాక వెంకటసత్యనారాయణ  ప్రస్తుతం ఆయన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక్ వెంకటసత్యనారాయణ గోదావరి జిల్లాల్లో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ కేంద్ర మంత్రి అరుణా ఇరానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీజేపీ సోమవారం అధికారికంగా పాక వెంకటసత్యనారాయణ పేరు ప్రకటించడంతో ఆ వార్తలన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాక వెంకటసత్యనారాయణ బీసీ వర్గానికి చెందిన నాయకుడు. మంచి వక్త. వివాదరహితుడు. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా అంకిత భావంతో పని చేస్తున్నారు. వెంకటసత్యనారాయణను  రాజ్యసభ సభ్యత్వం దక్కడం పట్ల బీజేపీ రాష్ట్రనాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  బీజేపీ ఏపీ కోర్ కమిటీ సోమవారం (ఏప్రిల్ 28) సమావేశమై బీజేపీ అభ్యర్థిపై చర్చించింది. పలువురి పేర్లను పరిశీలించిన తరువాత పాక వెంకటసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసి అధిష్ఠానానికి పంపింది.  ఈ కోర్ కమిటీ సమావేశంలో యూరప్ పర్యటనలో ఉన్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ పాక్ వెంకటసత్యనారాయణ పేరును అధిష్ఠానానికి పంపింది. మరో ఆలోచన లేకుండా పార్టీ హైకమాండ్ కూడా ఆ పేరునే ఖరారు చేసి ప్రకటించింది. పాక్ వెంకటసత్యనారాయణ మంగళవారం (ఏప్రిల్ 29)న నామినేషన్ దాఖలు చేయనున్నారు.  వాస్తవానికి, ఈ రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి పలువురి పేర్లు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి, పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర నేతకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయను న్నారు.
రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంటకసత్యనారాయణ.. విధేయత, సీనియారిటీకే పెద్దపీట Publish Date: Apr 28, 2025 10:39PM

కేటీఆర్‌కు వెన్ను పూసలో గాయం.. కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరం

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఎక్స్ వేదికగా అభిమానులకు, బీఆర్‌ఎస్ శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో.. జిమ్ లో వర్కౌట్  చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో వైద్యులను సంప్రదించగా.. కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని, అప్పటివరకు బెడ్ రెస్ట్  అవసరం అని సూచించినట్లు చెప్పారు. నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు  
కేటీఆర్‌కు వెన్ను పూసలో గాయం.. కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరం Publish Date: Apr 28, 2025 9:20PM

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

  ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నా అభినందనలు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్నారు.
బాలకృష్ణకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు Publish Date: Apr 28, 2025 8:34PM

ఏపీ రాజ్యసభ ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకటసత్యనారాయణ

    ఏపీలో ఖాళీ అయిన  రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. భీమవరం బీజెపి క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ పేరును కమలం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాక గతంలో భీమవరం కౌన్సిలర్ గా పని చేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా పాక పేరును ప్రకటించారు.  ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి తిరుగుపయనంలో దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ స్థానానికి ఎస్సీ వర్గీకరణలో కీలకంగా వ్యవహరించిన నేత, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  తమిళనాడుకు చెందిన అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది  
ఏపీ రాజ్యసభ ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకటసత్యనారాయణ Publish Date: Apr 28, 2025 7:48PM