Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైకాపాకు 167 సీట్లు గ్యారంటీ : జగన్
posted on: Jul 18, 2014 8:13PM
.jpg)
ఎన్నికలకి సరిగ్గా పదిరోజుల ముందు కూడా తన ఓటమిని పసిగట్టలేని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఓటమి నుండి తేరుకొన్న తరువాత వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి 125 సీట్లు పైనే వస్తాయని జోస్యం చెప్పారు. మళ్ళీ ఈరోజు ఆ సంఖ్యని మరికొంత పెంచి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తన పార్టీకి 167 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బహుశః మరి కొన్ని రోజుల తరువాత మొత్తం 175 సీట్లు తమ పార్టీకే వచ్చేస్తాయని తేల్చి చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎన్నికల ప్రచార సభలో 30యంపీ సీట్లు, 115-125 అసెంబ్లీ సీట్లు సాధించి కేంద్రంలో, రాష్ట్రంలో గిరగిర చక్రం తిప్పుతానని ఖరాఖండిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాదాల వల్లన్నే ఓడిపోయారు. అందుకు తనను తాను నిందించుకోకపోగా ప్రజామోదంతో ఎన్నికలలో విజయం సాధించి అధికారం చెప్పట్టిన చంద్రబాబు నాయుడుని నిందించడం విశేషం. మరో ఐదేళ్ళ దాక ఎన్నికలు ఎలాగు రావు గనుక కేవలం 167 సీట్లు మాత్రమే వస్తాయని తృప్తిపడటం కంటే, తమ పార్టీని ఎలాగూ జాతీయ పార్టీగా ప్రకటించుకొన్నారు గనుక యావత్ దేశంలో తమ పార్టీయే గెలిచి తనే ప్రధానమంత్రి అయిబోతునట్లు ఊహించుకొంటే ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది కదా? ఏమయినప్పటికీ జగన్ తన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పగలుగుతున్నపుడు, ఆ నోటితోనే తన సీబీఐ కేసుల పురోగతి గురించి కూడా నాలుగు ముక్కలు చెపితే బాగుండేది కదా?


.jpg)



