Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నందమూరి హరికృష్ణ పప్పులుడకలేదు
posted on: Apr 21, 2014 2:42PM
.jpg)
ఎన్టీఆర్ పెద్ద కొడుకైనప్పటికీ హరికృష్ణ అటు సినిమాల్లోగానీ, రాజకీయాల్లోగానీ ఎందుకు షైన్ కాలేకపోయాడు? ఏ రంగంలోనూ తనదైన ముద్ర ఎందుకు వేయలేకపోయాడు? ఇలాంటి సందేహాలు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి వస్తుంటాయి. అలాంటి వారందరికీ సమాధానం తాజాగా హరికృష్ణని గమనిస్తే దొరకుతాయి. హరికృష్ణ మొదటి నుంచీ రాజకీయంగా గెస్ట్ ఆర్టిస్టులా వున్నాడు. రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆయన పెద్దగా పరిపాలనా దక్షతను ప్రదర్శించిందేమీ లేదు. ఎన్టీఆర్ కొడుకైనందువల్ల చంద్రబాబు అప్పుడప్పుడు హరికృష్ణకి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాడు. అయితే దానిని హరికృష్ణ నిలుపుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ వెలుగులోకి రావడంలో అతన్ని అడ్డం పెట్టుకుని హరికృష్ణ చంద్రబాబు దగ్గర డిమాండ్ల చిట్టా పెట్టడం మొదలుపెట్టాక చంద్రబాబు హరికృష్ణని మెల్లగా దూరం చేయడం ప్రారంభించాడు. పోనీలే కదా అని రాజ్యసభకి పంపిస్తే, ఆ కోపం ఈకోపం రాజ్యసభ స్థానం మీద చూపించి రాజీనామా చేసేశాడు. దరిద్రమేంటోగానీ, సమైక్య ఉద్యమం సందర్భంగా ఎవరి రాజీనామాను ఆమోదించని రాజ్యసభ ఛైర్మన్ హరికృష్ణ రాజీనామాని మాత్రం చటుక్కున ఆమోదించేశాడు. దీనికితోడు చంద్రబాబు కూడా ‘రాజీనామా చేశావా... సర్లే’ అని కూడా అనకుండా సైలెంట్గా వున్నాడు. దాంతో హరికృష్ణలోని అహం బాగా దెబ్బతింది. ఎన్నికలు వచ్చాక హరికృష్ణ అసెంబ్లీ టిక్కెట్ అడిగాడు. మొదట హిందూపురం, తర్వాత పెనమలూరు, ఆ తర్వాత నూజివీడు.. ఏ టిక్కెట్టు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. హరికృష్ణ మీడియా ముందుకు వచ్చి మొత్తుకున్నా సీటు ఇవ్వలేదు. బీజేపీలోకి వెళ్తానని, ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని బెదిరించినా బాబు దారికి రాలేదు. చివరికి హరికృష్ణ కూడా నామినేషన్ ఏమీ వేయకుండానే ఇంట్లో కూర్చున్నాడు. ఇదీ హరికృష్ణ పరిస్థితి. పప్పులుడికినంతకాలం తెలుగుదేశంలో బాగానే హవా నడిపాడు. ఇప్పుడు పప్పులుకకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీచేసే సత్తా, బీజేపీలో చేరే దమ్ము లేక సైలెంటైపోయాడని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.


.jpg)
.jpg)


