Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి.. ఇక అరెస్టేనా?
posted on: Jun 19, 2026 4:02PM
.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్దమైందా? అంటే రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై, అప్పటి ప్రతిపక్ష నేతలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తెలుగుదేశం కూటమి సిద్ధమైందని అంటున్నారు. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంతో గుడివాడ రాజకీయాలతో పాటు ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
నిజానికి కొడాలి నానిపై కేవలం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కేసు మాత్రమే కాదు.. ఆర్థిక, శాంతిభద్రతల సమస్యలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గతంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతుగా దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గుడివాడ పరిధిలోనే సుమారు 100 కోట్ల రూపాయల విలువైన మట్టిని అక్రమంగా తరలించారని, జగనన్న కాలనీల భూములను లెవెల్ చేసే ప్రక్రియలో కొందరు స్థానిక యువకుల ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను వాడుకుని భారీగా నిధుల బదిలీ జరిగిందని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
మట్టి కుంభకోణంలోనూ, అలాగే.. గతంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై జరిగిన దాడుల కేసుల్లోనూ కొడాలి నానికి నేరుగా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసుల్లో కొందరిని అరెస్టు కూడా అయ్యారు. కాగా.. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. దీనితో పాటు మట్టి తవ్వకాలు, గుడివాడ తెలుగుదేశం కార్యాలయం దగ్ధం, రావి వెంకటేశ్వరరావు కార్యాలయంపై దాడి కేసులలో కూడా నానిని విచారించి.. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాసిక్యూషన్ ప్రక్రియ ద్వారా ఆయనపై నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.



.webp)


