బిర్యానీ కోసం.. ఐపీఎస్ అధికారిణి కక్కుర్తి.. చివరికి..
posted on Jul 31, 2021 12:10PM
ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటారు..అది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన అందరికి తెలిసిన విషయమే.. కానీ ఓ ఐపీఎస్ అధికారిణి.. బిర్యానీ కోసం కక్కుర్తి పడింది. చివరకు ఆ కక్కుర్తి పికల్లోతు వివాదంలో కూరుకుపోయింది. చివరకు ప్రభుత్వమే స్పందించి. ఆ మహిళా ఐపీఎస్ అధికారి చేసిన నిర్వాకంపై విచారించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే పరిధిలో జరిగింది. అక్కడ డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో మహిళా ఐపీఎస్ అధికారిణి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన సబార్డినేట్తో విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ రెస్టారెంట్లో మంచి బిర్యానీ దొరుకుతుందనేది అడిగి తెలుసుకున్నారు. దేశీ ఘీ రెస్టారెంట్లో మంచి బిర్యానీ దొరకుతుందని చెప్పడంతో.. అక్కడి నుంచి మటన్ బిర్యానీ తెప్పించాలని ఐపీఎస్ అధికారిణి కోరారు.
ఈ క్రమంలో రెస్టారెంట్ వాళ్లు తమ పద్ధతోలో డబ్బులు అడిగారు. అడిగితే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడించాలంటూ ఆర్డర్ జారీ చేశారు. తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా..? ఎందుకు అంటు ఆమె సబార్డినేట్తో మాట్లాడారు. అదేదో అధికారులకు రాజ్యాంగంలో రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళు ఫ్రీ గా బిర్యానీ ఇవ్వాలి అని రూల్ పెట్టినట్లు. దానికి సబార్టినేట్ తాము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసినా.. డబ్బులు చెల్లిస్తామటూ సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్.. మన పరిధిలో ఉన్న రెస్టారెంట్కు కూడా డబ్బులు చెల్లించాలా.. ఇదంతా అక్కడున్న ఇన్స్పెక్టర్ చూసుకుంటాడంటూ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ తతాంగమంతా మహారాష్ట్ర హోం మంత్రి వాల్సే పాటిల్ దగ్గరికి చేరింది. వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. విచారణ అనంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి తెలిపారు. వాళ్ళు కూడా రెస్టారెంట్ నడిపేదే బతకడానికి కదా మరి.. ఆ విషయం అర్థం చేసుకోలేదు బాగా చదువుకున్న ఆఫీసర్. పైగా ఆమె వ్యవహారం సదువుకున్న వాడికంటే ఆడెవ్వడో బెటర్ అనే సామెత లా తయారైయింది.
ఈ విషయంపై ఐపీఎస్ అధికారిణి స్పందించారు. తన ఆడియో క్లిప్ను కొంతమంది మార్ఫింగ్ చేశారంటూ కొత్త నాటకానికి తెరలేపారు. ఇదంతా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందనని.. కుట్రతోనే ఇలా చేశారని ఆమె అన్నారు. తాను ఇక్కడ ఉద్యోగంలో చేరిన తరువాత కొంతమంది సీనియర్ల ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయాయని.. దీంతో తనను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారని ఆమె తెలిపారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించనున్నట్లు మహిళా ఐపీఎస్ అధికారిణి తెలిపారు. నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అయినా బిర్యానీ తినాలనిపిస్తే 500 పెడితే సరిపోతుంది కానీ మరి ఇలా చేయడం ఏంటని కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మంట లేనిదే పొగ రాదంటారు సో ఎంతో కొంత నిజం ఉంటుందంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.