Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజకీయ నాయకులకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలి!
posted on: Apr 3, 2026 2:52PM

రాజకీయాలు, అవినీతి, సామాజిక అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్, జమీన్రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్తో కలిసి తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ నిర్వహిస్తున్న సంచలనాత్మక చర్చా కార్యక్రమం వాస్తవ వేదిక విజయవంతంగా కొనసాగుతోంది. తాజా సంచికలో తెలుగు రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలపై విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు సమాజానికి రోల్ మోడల్స్గా ఉండాల్సిన తరుణంలో, వారిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ వ్యసనం బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఇక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి వాడుకుంటున్నాయే తప్ప, మూలాల నుంచి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, వారి అనుచరులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు, అది మీడియా చర్చలకే పరిమితమవుతోంది తప్ప వారికి కఠినమైన శిక్షలు పడిన దాఖలాలు దాదాపు లేదన్నారు.
డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి కేవలం పోలీసు చర్యలు సరిపోవనీ, ఇందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల డ్రగ్స్ కేసుల విచారణలు తరచుగా నీరుగారిపోతున్నాయని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ లు అభిప్రాయపడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. డ్రగ్స్ వినియోగాన్ని చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణించకపోవడం కూడా డ్రగ్స్ వినియోగం నిర్మూళనకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం డ్రగ్స్ అమ్మడం నేరం కానీ, తీసుకోవడం పెద్ద నేరంగా పరిగణించడం లేదనీ, దీనివల్ల నిందితులు సులభంగా బయటపడే అవకాశం ఉందన్నారు.
రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక నూతన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించినట్లే, తాము డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉన్నామని నిరూపించుకోవడానికి డోప్ టెస్ట్' నివేదికలను సమర్పించే నిబంధనను తీసుకురావాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ఉండేవారు ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికలను బహిరంగపరచడం ద్వారా పారదర్శకతను పెంచాల్సి ఉందన్నారు. ఇది ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక సానుకూల సందేశాన్ని పంపుతుందన్నారు.
రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని రవిశంకర్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని రాజకీయాల నుంచి బహిష్కరించడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొన్న 'ఉడ్తా పంజాబ్' వంటి దుస్థితి తెలుగు రాష్ట్రాలకు రాకూడదంటే, రాజకీయ నేతలు స్వచ్ఛందంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనీ, రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాకుండా, సామాజిక బాధ్యతను నెరవేర్చే వేదికలుగా మారినప్పుడే ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడం సాధ్యమౌతుందనీ డోలేంద్రప్రసాద్, రవిప్రసాద్ లు పేర్కొన్నారు.


.webp)
.webp)


