కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నియామకం!

కుప్పం గంగమ్మఆలయ పాలక మండలి చైర్మన్ గా బీఎంకే రవిచంద్రబాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు.. ఆయనతో పాటు 10 మంది సభ్యులను కూడా ఎంపిక చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమైన ఆలయం కావడంతో ఈ ఆలయ పాలకమండలి నియామకం విషయంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన స్వయంగా పాలకమండలి చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి నియమించారు.   ఇక బీఎంకే రవిచంద్రబాబు విషయానికి వస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన రెండేళ్ల పాటు కుప్పం నియోజకవర్గంలో అన్న క్యాంటిన్ నిర్వహించారు. జగన్ ప్రభుత్వ దమనకాండను, దాష్టీకాన్ని గట్టిగా ఎదిరించి నిలబడ్డారు.  ఆలయ ప్రతిష్ఠ, పవిత్రతకు భంగం కలగకుండా గంగమ్మదేవాలయ పాలక మండలి ఉండాలన్న భావనతో చం్దరబాబు స్వయంగా కమిటీని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. కాగా బీఎంకే రవిచంద్ర చైర్మన్ గా 11 మందితో గంగమ్మ ఆలయకమిటీని నియమించిన చంద్రబాబు నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నారు.  ఇక ఈ కమిటీ ఎంపికలో చంద్రబాబు సామాజిక సమతుల్యత పాటించారని చెబుతున్నారు. 
కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నియామకం! Publish Date: Apr 1, 2025 7:06AM

చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం.. ఆనంద్ మహీంద్రా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ కేఫ్ లు విస్తరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ ఆయనీ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.  చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయనీ, ఆయన ఆచరణ అంతకంటే గొప్పగా ఉంటుందనీ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.   పారిస్‌లో తమ రెండో అర‌కు కాఫీ స్టాల్ అంటూ ఒక వీడియోను కూడా ఆ పోస్టుతో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్టుపై స్పందించిన సీఎం నారా చంద్రబాబునాయుడు  ప‌చ్చ‌ని అర‌కులోయ నుంచి పారిస్ న‌డిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్ప‌త్తి చేర‌డం, వ‌ర‌ల్డ్‌వైడ్‌గా త‌గిన గుర్తింపు ల‌భించ‌డం ర్తిదాయ‌క‌మ‌ని పేర్కొన్నారు.
చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం.. ఆనంద్ మహీంద్రా Publish Date: Apr 1, 2025 6:47AM

తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..మూడు రోజుల పాటు వానలు

వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. భూ ఉపరితలం వేడెక్కడం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి గురువారం (ఏప్రిల్3)  వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకూ తగ్గుతాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మొదక్, కామారెడ్డి, జోగులాంబ, వనపర్తి, వికారాబాద్, గద్వాల్ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. 
తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..మూడు రోజుల పాటు వానలు Publish Date: Apr 1, 2025 6:29AM

ఏపీలో 51 కరవు మండలాలు

గత ఏడాది ఏపీలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు అయినా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరువు మండలాల ప్రకటన సరిగా జరగలేదు. ఎదో మొక్కుబడి తంతుగా జగన్ సర్కార్ నాడు కరువు మండలాలను ప్రకటించి ఊరుకుంది.అయితే కూటమి సర్కార్ రైతుల ఇబ్బందులు, సమస్యలు, అలాగే స్థానిక పరిస్థితులు అన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని కరువు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా ఏపీలోని ఆరు జిల్లాల్లో 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్పీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకటించిన 51 మండలాల్లో 37 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు.  అందుకు అనుగుణంగా 2024-25 సంవత్సరానికి కరువు మండలాలను వెల్లడిస్తూ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు  జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను నిశితంగా పరిశీలించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ  స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటించింది కూటమి ప్రభుత్వం.  
ఏపీలో 51 కరవు మండలాలు Publish Date: Apr 1, 2025 6:03AM

పైలట్ అవతారమెత్తిన కేతిరెడ్డి

ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్ అయిన వైసీపీ నేతలు ఎవరి వ్యాపాకాల్లో వారు పడ్డారు. తమకు నచ్చింది చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ  కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయా అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేతల్లో కేతిరెడ్డి ఒకరు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు.. తన నియోజకవర్గం, పార్టీ సమావేశాలు, ఇతర కార్యక్రమాల గురించి .. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండేవారు.  2024 ఎన్నికల్లో కూటమి గాలికి కొట్టుకుపోయారు. ప్రస్తుతం ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.  కేతిరెడ్డి తాజాగా పైలట్ అవతారం ఎత్తారు. తానే స్వయంగా ప్రైవేట్ జెట్‌ని నడిపిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల నిజమయ్యింది అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యా. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ప్రైవేట్ జెట్‌ నడిపి తన కల నెరవేర్చుకున్నారు.
పైలట్ అవతారమెత్తిన కేతిరెడ్డి Publish Date: Mar 31, 2025 10:31PM