మహిళలకు కాంగ్రెస్ ద్రోహం.. ఏపీ సీఎం చంద్రబాబు

posted on: Apr 18, 2026 9:44AM

కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. మహిళా సాధికారత వైపు భారత్‌ వేయాల్సిన చారిత్రాత్మక అడుగును కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఇది కేవలం రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కదన్న ఆయన కాంగ్రెస్ ద్రోహాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...