డీకే అరుణకు షాక్..కారెక్కిన సోదరుడు

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి హస్తానికి హ్యాండిచ్చారు. టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో  సమావేశమైన చిట్టెం ఆ వెంటనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. చిట్టెం రామ్మెహన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీ కండువా కప్పుకున్నట్లు రామ్మోహన్ తెలిపారు.