Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెన్నై సెంట్రల్ స్టేషన్ లో బాంబు ప్రేల్లుళ్ళు
posted on: May 1, 2014 10:29AM
.jpg)
ఈ రోజు ఉదయం 7.15 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్ లో రెండు బాంబు ప్రేల్లుళ్ళు జరిగాయి. అందులో గుంటూరుకు చెందినా స్వాతి (22) అక్కడికక్కడే మరణించగా, మరో 14మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గౌహతి నుండి వయా చెన్నై బెంగుళూరు వెళ్ళవలసిన గౌహతీ-బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఈరోజు ఉదయం సుమారు 5.15గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్ లో 9వ నెంబర్ ప్లాట్ ఫారంపైకి చేరుకొంది. ఉదయం సరిగ్గా 7.12గంటలకు ఆ రైలులో యస్4 బోగీలో మొదటి ప్రేలుడు జరగగా మళ్ళీ రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే 7.15గంటలకు పక్కనున్న యస్.5 బోగీలో మరో ప్రేలుడు జరిగింది. ప్రేలుడు జరిగిన సంగతి తెలుసుకోగానే అక్కడికి చేరుకొన్న రైల్వే పోలీసులు, అధికారులు గాయపడినవారిని హుటాహుటిన స్థానిక రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. చెన్నై నుండి బయలు దేరవలసిన కొన్ని రైళ్ళను రద్దు చేయగా, చెన్నైకి రావలసిన మరికొన్ని రైళ్ళను వేరే స్టేషన్లకు మల్లిస్తున్నారు. పోలీసులు, దర్యాప్తు బృందాలు స్టేషన్ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఉగ్రవాదుల కుట్రే అని భావిస్తున్నారు. ఈ సంగతి తెలియగానే హైదరాబాద్ నుండి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హుటాహుటిన చెన్నై బయలుదేరి వెళ్ళారు. హెల్ప్ లైన్ నెంబర్:040-25357398






