Top Stories

సిర్పూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్... ఏడాది కాకముందే  కోనేరు కోనప్ప రాజీనామా 

బిఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లో చేరిర  సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏడాది తిరక్కుండానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో విభేధాలు తలెత్తడం వల్ల కోనేరు కోనప్ప రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైన ప్లై  ఓవర్ బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. 2014లో కోనేరు కోనప్ప బిఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత పార్టీ ఫిరాయించి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ లో  చేరారు. 2023 ఎన్నికల్లో బిఆర్ ఎస్ నుంచి సిర్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి బిజెపి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 
Publish Date: Feb 21, 2025 4:55PM

ఆ వ్యక్తి జీవితం స్పూర్తి దాయకం: చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టును షేర్ చేశారు.  . ఓ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నో దశాబ్దాల  కిందట హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవించేవాడు. దీన్ని  హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది.కష్టించి పనిచేసే స్వభావం, ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. కానీ, అతడు సొంతగడ్డను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లడం తనను విచారానికి గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వ్యక్తి హైద్రాబాద్  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఈ ఉత్పత్తులు విక్రయిస్తున్నాడు
Publish Date: Feb 21, 2025 4:02PM

శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు మరమ్మతులు

తిరుమల శ్రీవారి ఆలయంలో మరమ్మతు పనులు చేపట్టారు. లీకేజీల నివారణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదేశాల మేరకు మరమ్మతు పనులు మొదలయ్యాయి.   గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి మరమ్మతులు చేపట్టాలని తీర్మానించారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచితగా చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు
Publish Date: Feb 21, 2025 3:06PM

ప్రతి కుటుంబానికీ పాతిక లక్షలు ఆరోగ్య బీమా.. దటీజ్ బాబు!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. ముందు తరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పథకాలకు రూపకల్పన చేస్తారు. ఇదే ఆయనను  మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారిని సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది. ఒక అబ్దుల్ కలామ్, ఒక బిల్ గేట్స్ వంటి వారు తాము చంద్రబాబు అభిమానులమని బాహాటంగా ప్రకటించడం వెనుక కారణం కూడా ఇదే. అటువంటి చంద్రబాబు ఇప్పడు ప్రజా ప్రయోజనాలు, ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర పథకంతో ముందుకు వస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఎవరూ ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదన్న ఉద్దేశంతో ఆయన విప్లవాత్మక పథకానికి రూపకల్పన చేస్తున్నారు.  ఔను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో విప్లవాత్మక పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికీ పాతిక లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకానికి రూపకల్పన చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే దేశంలోనే ఇదొక ఆరోగ్య విప్లవంగా నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ  పథకం అమలులో ఉంది.  అయితే ఆ పథకం కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితం. ఉదాహరణకు ఈ పథకం కిందకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. అంతే కాకుండా ఈ పథకం పూర్తిగా అసంఘటితంగా ఉంది. ఈ పథకం కింద వైద్య సేవలు అందించే ప్యానల్ ఆస్పత్రుల సంఖ్య చాలా చాలా స్వల్పం. ఆ ఆస్పత్రులు కూడా తరచూ పెండింగ్ బిల్లులంటూ సేవలు నిలిపివేస్తామని బెదరిస్తాయి. పలు ఆస్పత్రులైతే ఈ పథకం కింద చికిత్స అందించడానికి పెండింగ్ బిల్లులు సాకు చూపుతూ నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకూ ఆరోగ్యబీమా కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు.  ఈ పథకం అమలులోకి వస్తే దేశంలోనే ఇది ఒక ఆరోగ్య విప్లవంగా అభివర్ణించవచ్చు.  ఒక అంచనా ప్రకారం ప్రతికుటుంబానికి ఆరోగ్య బీమా వర్తింప చేయడానికి కుటుంబానికి పాతిక వందల చొప్పున ప్రీమియం పడుతుంది. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బీమా కంపెనీల మధ్య పోటీ కారణంగా ప్రీమియం మరింత తగ్గే అవకాశాలను కూడా కొట్టి పారేయలేము. దివంగత వైఎస్సార్ తొలి సారిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకానికి ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఈ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా పేరు మార్పు వినా ఈ పథకాన్ని యథాతధంగా కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అమలు అవుతోంది. అయినప్పటికీ ప్రజలు దీనిని ఆరోగ్య శ్రీ పథకం అనే అంటున్నారు.  ఆ క్రెడిట్   వైఎస్సార్ ఖాతాలోనే పడుతోంది. దానిని అలా ఉంచితే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిమితులూ లేకుండా ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆరు గంటల్లో చికిత్సకు అనుమతి లభించడమే కాకుండా చెల్లింపులు సైతం వేగంగా జరుగుతాయి.  ఇది అమలులోకి వస్తే చంద్రబాబు పేరు చిరస్థాయిగా ప్రజల గుండెలలలో నిలిచిపోతుందని, అన్నిటికీ మించి ఇది చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద రాజకీయ పెట్టుబడి అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక సారి ఈ పథకం ఏపీలో అమలులోకి వస్తూ ఆ వెంటనే పలు రాష్ట్రాలు కూడా దీనిని తమ తమ రాష్ట్రాలలో అమలు చేస్తాయి. ఇందుకు రాజకీయ ప్రయోజనాలు ఒక కారణమైతే.. బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉండటం మరో కారణం. ఈ పథకాన్ని కనుక చంద్రబాబు రాష్ట్రంలో ముందుగా అమలులోకి తీసుకు వస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే ఆ పథకం కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా మాత్రమే కల్పిస్తున్నది.  అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదిస్తున్న బీమా పథకం మాత్రం  అంతకు ఐదింతలు ఎక్కువగా  పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తుంది.  
Publish Date: Feb 21, 2025 2:46PM

గుండెపోటుతో కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని

14 ఏళ్ల బాలిక గుండెపోటుతో కుప్పకూలింది. ఈ ఘటన కామారెడ్డిలో శుక్రవారం (ఫిబ్రవరి 20) జరిగింది. టెన్త్ విద్యార్థిని అయిన శ్రీనిథి కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది.  రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి  పెద్ద నాన్న కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ కాలనిలో నివాసం ఉండగా అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వస్తుంటుంది. ఎప్పటిలాగే కల్కినగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా   స్కూల్ వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు వెంటనే  ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే  శ్రీనిథి హార్ట్ బీట్  ఆగిపోయింది. అయినా వైద్యులు సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా  ఫలితం లేకపోయింది. శ్రీనిధి మృతితో కామారెడ్డి పట్టణంలో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువు విషయంలో శ్రీనిధి ముందంజలో ఉండేదని, మంచి విద్యార్థినిని   కోల్పోయామని పాఠశాల ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Publish Date: Feb 21, 2025 2:41PM

అధికారం బాబుదే.. అధికారులు భయపడేది మాత్రం జగన్ కే

క్ర‌మశిక్ష‌ణ క‌లిగిన రాజ‌కీయాల‌కు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరు. ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత పార్టీలో గీత‌ దాటి వ్య‌హ‌రించిన నేత‌లను ఇసుమంతైనా ఉపేక్షించ‌రు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను విమ‌ర్శించే స‌మ‌యంలోనూ అస‌భ్యప‌ద‌జాలం వాడితే ఎట్టిప‌రిస్థితుల్లో ఊరుకోరు. అధికారంలో ఉన్నా.. ప్రతిప‌క్షంలో ఉన్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే చంద్ర‌బాబు ధ్యేయం. తెలుగుదేశం పార్టీ నేతల లక్ష్యం కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. అలాగే ఉండమని ఆదేశిస్తారు.  చంద్రబాబు నాలుగు దశాబ్దాలు పైబడిన రాజకీయ జీవితమంతా ఇలాగే కొనసాగింది. చంద్రబాబు తన నిబద్ధతతో తెలుగుదేశం పార్టీని దేశంలోని ఇత‌ర రాజకీయ పార్టీల‌కు ఆద‌ర్శంగా నిలిపారనడంలో సందేహం లేదు. అయితే గత  ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోన‌న్ని ఇబ్బందుల‌ను చ‌విచూశాడు. ఒక్క‌చాన్స్ ప్లీజ్ అంటూ  అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌రువాత త‌న నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాడు. టీడీపీ నేత‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశాడు. దాడుల చేయ‌డంతోపాటు అక్ర‌మ కేసుల‌తో జైళ్ల‌కు పంపించాడు. దీంతో చాలామంది టీడీపీ నేత‌లు వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో జైళ్ల‌కే ప‌రిమితం అయిన ప‌రిస్థితి. చివ‌రికి చంద్ర‌బాబు నాయుడుపైనా అక్ర‌మ కేసు పెట్టి జైలుకు పంపించారు.  జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది మేమే.. నాలో మ‌రో చంద్ర‌బాబును చూస్తారంటూ వైసీపీ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కొంద‌రు అధికారుల, పోలీసుల తీరుపైనా చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని అవుతున్నా.. హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన వారికి త‌గిన శాస్త్రి జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు.  స్వతహాగా  చంద్ర‌బాబు క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు దూరం. అయితే, గ‌త ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప‌డిన ఇబ్బందుల‌ను చూసి చంద్ర‌బాబు ఆవేశం క‌ట్ట‌లుతెంచుకుంది. అందుకే వైసీపీ నేతలకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.  గ‌త ఎన్నిక‌ల్లో ఐదేళ్లు జ‌గ‌న్ పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టి ఎనిమిది నెల‌లు అయ్యింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఆయన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. తనకు ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ముఖ్యం అని గట్టిగా చెబుతున్నారు.  ఇది తెలుగుదేశం క్యాడర్ లో ఒకింత అసంతృప్తికి కారణమౌతోంది. వైసీపీ హ‌యాంలో రెచ్చిపోయిన నేత‌ల‌పై పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో చంద్రబాబు కొర‌డా ఝుళిపించ‌డం లేద‌న్న ఆగ్రహం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.  చంద్ర‌బాబు మంచిత‌నాన్ని ఆస‌రాగా చేసుకుంటున్న వైసీపీ నేత‌లు.. ఇంకా తామే అధికారంలో ఉన్నామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయితే.. తానకు తానే తనకు లేని ప్రతిపక్ష హోదా ప్రకటించేసుకుని నేను ఎటుపోయినా గ‌ట్టి భ‌ద్ర‌త ఇవ్వాలి అంటూ దాదాపు హెచ్చ‌రిక‌లు చేస్తున్నాడు. తాజాగా గుంటూరు మార్కెట్ యార్డులో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌లు చేసిన ర‌చ్చ మామూలుగా లేదు.  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉంది. పర్యటనకు అనుమతి లేదు అని అధికారులు స్పష్టంగా చెప్పినా జగన్ లెక్క చేయలేదు.   మిర్చి రైతుల‌కు సంఘీభావం తెలిపేందుకు జ‌గ‌న్ యార్డులోకి వెళ్లాడు. త‌న వెంట వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పెద్ద‌సంఖ్య‌లో స‌భ‌కు తీసుకెళ్లిన‌ట్లు తీసుకెళ్లాడు. దీంతో మార్కెట్ యార్డులో వైసీపీ నేత‌ల అరాచ‌కానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంద‌రు వైసీపీ నేత‌లు రైతుల మిర్చి బ‌స్తాల‌ను దొంగిలించుకు పోయారు. అంత‌కుముందు జైల్లో ఉన్న‌ వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన స‌మ‌యంలోనూ జ‌గ‌న్, వైసీపీ నేత‌లు హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ అస‌భ్య‌క‌ర భాష‌తో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌ను విమ‌ర్శించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీనికితోడు గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీ కీల‌క సూత్ర‌దారి. అంతేకాక‌.. టీడీపీ కార్యాల‌యం ద‌గ్గ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి వంశీ అడ్డంగా దొరికిపోయాడు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం వంశీ అమాయ‌కుడు, అక్ర‌మంగా కూట‌మి ప్ర‌భుత్వం కేసులు పెట్టింద‌ని అబ‌ద్ధాల‌ను తేలిగ్గా చెప్పేశారు. దీనికితోడు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.  మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది మేమే.. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే బ‌ట్ట‌లు ఊడ‌దీసి నిలబెడతా అంటూ అధికారులకు హెచ్చరికలు సైతం జారీ చేశారు.   జ‌గ‌న్ హెచ్చ‌రిక‌ల‌తో అధికారులు, పోలీసులుసైతం భ‌య‌ప‌డుతున్నారు. దీంతో అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అయినా, అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికీ జగన్ చెప్పినట్లే నడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. జగన్ లా కక్ష సాధింపు చర్యలకు పాల్పడరన్న ధీమాయే అధికారుల తీరుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ఎన్నికల నియమావళికి ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. అక్కడ రాజకీయ ప్రసంగాలు చేశారు. మళ్లీ ఎదురు తనకు సరైన భద్రత కల్పించలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా జగన్ ను మార్కెట్ యార్డులోకి అధికారులు ఎలా వెళ్ల నిచ్చారు? అంటే ఆపితే జగన్ ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయమే అధికారులు తమ విధులను పక్కన పెట్టేయడానికి కారణమని భావించాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆ ఫలితాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జగన్ అరాచకపాలనలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని పార్టీ కోసం నిలబడిన తమకు, పార్టీ అధికారంలో ఉన్నా.. అధికార యంత్రాంగం ఇంకా జగన్ కే వత్తాసు పలుకుతున్న పరిస్థితి శ్రేణులకు మింగుడు పడటం లేదు. దీంతో వారు చంద్రబాబు మరీ ఇంత మెతకా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్న వారిని చట్ట ప్రకారం శిక్షించే విషయంలో చంద్రబాబు ఉదాశీనత వీడకుంటే.. పార్టీ క్యాడర్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Feb 21, 2025 1:11PM